తనతోపాటు బైక్ పై రాలేదని ఓ భర్త కోపంతో తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఇరికేపల్లి జంగాల కాలనీలో చోటుచేసుకుంది. కేవలం ద్విచక్ర వాహనంపై తన భర్తతో పాటు కలిసిరానని చెప్పినందుకు ఆవేశంతో అతను తన భార్యపై కత్తితో దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సుధాకర్ అనే వ్యక్తి తన భార్య భవాని, పిల్లలతో కలిసి మాచర్లలో జరిగిన వివాహ కార్యక్రమానికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. ఈ క్రమంలోనే తిరిగి వస్తున్న సమయంలో తన భార్య ద్విచక్రవాహనంపై రానని అభ్యంతరం తెలిపింది. తన భర్త సుధాకర్ అతివేగంతో వాహనాన్ని నడపడం కారణంగా ఆమె అతనితో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్లడానికి అభ్యంతరం తెలిపింది. తరువాత ఆమె బస్సులో ఇంటికి చేరుకుంది. అయితే తనతోపాటు బైక్పై రావడానికి నిరాకరించిందనే కోపంతో ఇంటికి వచ్చిన భార్యతో సుధాకర్ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి సుధాకర్ ఆవేశంతో పక్కనే ఉన్న కత్తి తీసుకుని భవాని గొంతు కోసి పరారయ్యాడు.
ఈ క్రమంలోనే భవానిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆమె గొంతుకు పదహారు కుట్లు పడ్డాయి. దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు .
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…