ఏపీలో ఉన్న నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ జాబ్ మార్చి 2022 వరకు జాబ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 2022 వరకు మొత్తం 10,143 ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.
దళారులు, సిఫారసులు, పైరవీలు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతామని సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారని అన్నారు. వారు మనో ధైర్యం కోల్పోకుండా ఉండేందుకే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్యాలెండర్ ద్వారా ఏ ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ఏ నెలలో వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చన్నారు. 2 ఏళ్లలో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేశామని, 1,84,264 ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన, 3,99,791 ఉద్యోగాలను పొరుగు సేవల రూపంలో భర్తీ చేశామన్నారు. మరో 19,701 ఒప్పంద ఉద్యోగాలను ఇచ్చామన్నారు. రూ.3500 కోట్ల భారం పడుతుందని తెలిసినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు తెలిపారు. 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పించినట్లు వివరించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…