ఎన్నో రకాల స్వీట్లలో అందరూ ఎంతగానో ఇష్టపడే పాటలు మైసూర్ పాక్ ఒకటి. అందరూ ఎంతో ఇష్టంగా తినే మిల్క్ మైసూర్ పాక్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*పాల పొడి ఒక కప్పు
*మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు
*నెయ్యి రెండు కప్పులు
*చక్కెర రెండున్నర కప్పులు
*బేకింగ్ సోడా చిటికెడు
*నీళ్లు ఒక కప్పు
*ఫుడ్ కలర్
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పాలపొడి మైదా పిండి ఒక కప్పు నెయ్యి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె ఉంచి పంచదార వేసి సరిపడా నీళ్లు పోసి పాకం తయారు చేసుకోవాలి. ఈవిధంగా గరిటతో బాగా కలియబెడుతూ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని తీగపాకం వచ్చేవరకు కలియబెట్టాలి.తీగ పాకం వచ్చిన తరువాత పాలపొడిని ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలియబెడుతూ బుడుగలు వచ్చేవరకు బాగా ఉడికించాలి. తర్వాత ఈ మిశ్రమంలో కి కొద్దికొద్దిగా నెయ్యి కలుపుతూ మిశ్రమం మొత్తం బాగా దగ్గరపడే వరకు కలపాలి. ఈ విధంగా మిశ్రమం మొత్తం బాగా చిక్కగా అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఒక దీర్ఘ చతురస్రాకారపు బాక్స్ లోకి నెయ్యి పూసి తయారు చేసుకున్న మిశ్రమం మొత్తం అందులోకి వేయాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారిన తర్వాత మనకు ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో కట్ చేసి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మిల్క్ మైసూర్ పాక్ తయారైనట్లే.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…