సాధారణంగా కూతురంటే తండ్రికి ఎంతో ఇష్టం. కూతురుకి కూడా ఆ తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉంటుందని చెబుతుంటారు. ఈ విధమైనటువంటి తండ్రీ కూతుర్ల మధ్య ఉన్న ప్రేమానురాగం ఈ విపత్కర సమయాలలో కూడా బయట పడుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ అని తెలిస్తే ఆ వ్యక్తి దగ్గరకు ఎవరు వెళ్ళడానికి సాహసం చేయరు. అది సొంత వాళ్ల అయినా కూడా వాళ్ళను దూరంగా పెట్టడం చూస్తున్నాము.
కాని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.జగన్నాథ వలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరి నాయుడు(44) విజయవాడలో కూలి పనులు చేసుకుంటుండగా అతను కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే తమ కుటుంబం మొత్తం సొంతూరికి వచ్చారు. అసిరి నాయుడు కి పాజిటివ్ అని తెలియగానే అతని కుటుంబాన్ని ఊరి చివరలో ఉన్నటువంటి ఒక గుడిసెలో ఉండాలని స్థానికులు చెప్పడంతో చేసేదేమిలేక ఊరి చివర ఉన్న పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు.
ఈక్రమంలోనే అసిరి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉన్నఫలంగా నేలపై కూలిపోయాడు.తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న అతనిని చూసి తన భార్య కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేక పోయింది. కానీ తన కూతురు మాత్రం తన తండ్రి ప్రాణాలను రక్షించుకోవాలని ఎంతో ఆరాటపడింది. తన తల్లి వద్దని వారిస్తున్నా తండ్రి పై ఉన్న ప్రేమతో తండ్రి దగ్గరకు వెళ్లి అతనికి నీళ్లు తాపింది. కానీ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అసిరి నాయుడు మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన అక్కడున్న వారందరిని ఎంతో కలిచివేసింది. ఇలాంటి దుస్థితి మరెవరికీ రాకూడదని అక్కడున్న వారందరూ బోరున విలపించారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…