దివంగత ముఖ్యమంత్రి, మహా నాయకుడు వైఎస్సార్ అప్పట్లో ప్రజా సంక్షేమ పథకాలతో ఎంతటి ప్రజాదరణను చూరగొన్నారో అందరికీ తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఆయన అడుగు జాడల్లోనే ప్రస్తుతం ఆయన తనయుడు సీఎం జగన్ నడుస్తున్నారు. అప్పట్లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే జగన్ ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రశంసిస్తుంటారు.
అయితే అప్పట్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి వెళ్లినప్పుడు వైఎస్సార్ బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడారు. షాట్లు కొడుతూ అలరించారు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ కూడా అలాగే బ్యాట్తో క్రికెట్ ఆడారు. షాట్లు కొడుతూ ఆకట్టుకున్నారు.
సీఎం వైఎస్ జగన్ తాజా కడప పర్యటనలో భాగంగా వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఫ్లడ్ లైట్ల పనులను ప్రారంభించారు. అనంతరం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. దీంతో అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ అభిమానులను అలరించారు.. అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ క్రికెట్ ఆడిన వీడియో వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…