దివంగత ముఖ్యమంత్రి, మహా నాయకుడు వైఎస్సార్ అప్పట్లో ప్రజా సంక్షేమ పథకాలతో ఎంతటి ప్రజాదరణను చూరగొన్నారో అందరికీ తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఆయన అడుగు జాడల్లోనే ప్రస్తుతం ఆయన తనయుడు సీఎం జగన్ నడుస్తున్నారు. అప్పట్లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే జగన్ ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రశంసిస్తుంటారు.
అయితే అప్పట్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి వెళ్లినప్పుడు వైఎస్సార్ బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడారు. షాట్లు కొడుతూ అలరించారు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ కూడా అలాగే బ్యాట్తో క్రికెట్ ఆడారు. షాట్లు కొడుతూ ఆకట్టుకున్నారు.
సీఎం వైఎస్ జగన్ తాజా కడప పర్యటనలో భాగంగా వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఫ్లడ్ లైట్ల పనులను ప్రారంభించారు. అనంతరం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. దీంతో అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ అభిమానులను అలరించారు.. అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ క్రికెట్ ఆడిన వీడియో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…