పెళ్లి పీటలపై కూర్చుని కొన్ని నిమిషాలలో మూడుముళ్ల బంధంతో ఒకటి కావాల్సిన ఆ జంటను కరోనా విడదీసింది. మూడు ముళ్ళు పడి, ఏడడుగులు నడవాల్సిన ఆజంట కరోనా దెబ్బకు ఎక్కడివారక్కడ పరుగులు పెట్టారు. ఈ విచిత్ర ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన అబ్బాయికి ముదిగుబ్బకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయించారు.అనుకున్న సమయానికి పెళ్లి వేడుకలు మొదలై తీవ్ర పెళ్లి జరిగే సమయంలో పెళ్లికూతురు తనకు ఇష్టం లేదని మొండి పట్టుపట్టింది.
తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని,తనకు కరోనా పాజిటివ్ అని చెబుతున్నా వినకుండా పెళ్ళికి ఏర్పాట్లు చేయడంతో ఈ విషయం కాస్త పోలీసుల వరకు చేరింది. కరోనాను అడ్డుపెట్టుకొని ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడమే కాకుండా పెళ్లికొడుకు వారు తమను తన కూతురిని బెదిరిస్తున్నారని పెళ్లి కూతురు పోలీసుల ఎదుట తెలిపింది.
మరో వైపు పెళ్ళికొడుకు నుంచి మూడు లక్షల నగదు, బంగారం తీసుకున్నారని డబ్బు ఆశతోనే పెళ్లికి ఒప్పుకోవడం లేదని పెళ్ళికొడుకు అంటున్నారు. పెళ్లికూతురు ఇష్టప్రకారమే పెళ్లికి ఒప్పుకున్నట్లు మధ్యవర్తులు చెబుతున్నారు. మొదట్లో డబ్బులు తీసుకొని తీరా పెళ్లి సమయానికి ఈ విధంగా అడ్డుపడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కదిరి టౌన్ ఎస్సై మహ్మద్ రఫీ చెప్పడంతో ఇరువురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి కరోనా ఆ జంట ను విడదీసిందని చెప్పవచ్చు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…