Anchor Suma : దాదాపుగా 8 ఏళ్ల తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది యాంకర్ సుమ. ఇన్నాళ్లూ తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులని అలరించిన సుమ ఇప్పుడు వెండితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధమైంది. రీసెంట్గా తనను సినిమా చేయమని అడుగుతున్నారని, చేసేస్తే పోలా అని చెప్పిన సుమ తన రీఎంట్రీ మూవీ ఫస్ట్ లుక్ని రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయించింది.
వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్లో సుమ పల్లెటూరిలో ఊరి పెద్దగా కనిపించింది. ఇక చుట్టూ వేర్వేరు కథలను చూపించారు. గ్రామంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా జయమ్మ పంచాయితీకి రావాల్సిందే.. అన్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
”సుమ గారూ.. ప్రతి తెలుగు ఇంట్లో అత్యంత ఇష్టపడే పేరు. ఇప్పుడు 70ఎంఎం స్క్రీన్ పైకి వచ్చేస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని చరణ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. సినిమాకి విజయ్ కుమార్ కలివరపు కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. విజయలక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే ఓ సినిమాలో హీరోయిన్గా చేసిన సుమ.. మళ్ళీ ఇన్నేళ్లకు ఇంత స్ట్రాంగ్ రోల్తో రీ- ఎంట్రీ ఇస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొల్పుతోందని చెప్పవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…