Anasuya : బుల్లితెరపై ఎంతో సక్సెస్ ఫుల్గా కొనసాగుతున్న షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షోకు ఎంతో మంది కమెడియన్లు వచ్చి వెళ్లిపోయారు. అయితే నాగబాబు వెళ్లిన తరువాత మళ్లీ ఇన్ని రోజులకు జబర్దస్త్ లో ఒక భారీ కుదుపు వచ్చేసింది. రోజా, తరువాత కమెడియన్లు ఆది, సుధీర్, గెటప్ శ్రీను.. ఇలా అందరూ వరుస పెట్టి జబర్దస్త్కు వీడ్కోలు పలికారు. అయితే కిరాక్ ఆర్పీ ఈమధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కొందరు ఆర్పీని సపోర్ట్ చేయగా.. కొందరు మాత్రం మల్లెమాలకు మద్దతు పలికారు. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ కూడా జబర్దస్త్కు అధికారికంగా గుడ్ బై చెప్పేసింది. ఈ క్రమంలోనే ఆమె వీడ్కోలు ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
ఇక వీడ్కోలు ఇస్తున్న సందర్భంగా అనసూయ పేరిట ఓ స్కిట్ చేశారు. అందులో టీమ్ సభ్యులు అనసూయను బతిమాలారు. నెలలో మూడు రోజులు అయినా సమయం కేటాయించలేవా.. అని అడిగారు. అందుకు అనసూయ కష్టమని సమాధానం చెప్పింది. దీంతో కన్నీటితో ఆమెకు వీడ్కోలు పలికారు. జడ్జి ఇంద్రజ కూడా భావోద్వేగానికి గురైంది. అలాగే టీమ్ సభ్యులు కూడా జబర్దస్త్ పర్మినెంట్ అని.. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారని అన్నారు. ఇక అనసూయ జూన్ నెలలోనే తాను జబర్దస్త్కు గుడ్ బై చెబుతున్నట్లు పరోక్షంగా చెప్పింది.
తాను తన కెరీర్లో కీలకమైన నిర్ణయం తీసుకున్నానని.. ఇకపై కూడా మీ మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నానని.. గత నెలలో అనసూయ తెలియజేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె జబర్దస్త్ను విడిచిపెడుతుందని.. అందుకనే అలాంటి కామెంట్స్ చేసిందని అన్నారు. అయితే అదే నిజమైంది. ఆమె అధికారికంగా ఈ షోకు వీడ్కోలు పలికింది. ఆమెకు సినిమాల్లో ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని తెలిసింది. కనుకనే ఇకపై టీవీ షోలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ యాంకర్గా పేరున్న అనసూయ కూడా వెళ్లిపోవడంతో ఇక జబర్దస్త్కు ఉన్న ఇంకాస్త కళ కూడా తప్పినట్లే అని అంటున్నారు. మరి రేటింగ్స్ ఎలా వస్తాయో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…