Anasuya : బుల్లితెరపై ఎంతో సక్సెస్ ఫుల్గా కొనసాగుతున్న షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షోకు ఎంతో మంది కమెడియన్లు వచ్చి వెళ్లిపోయారు. అయితే నాగబాబు వెళ్లిన తరువాత మళ్లీ ఇన్ని రోజులకు జబర్దస్త్ లో ఒక భారీ కుదుపు వచ్చేసింది. రోజా, తరువాత కమెడియన్లు ఆది, సుధీర్, గెటప్ శ్రీను.. ఇలా అందరూ వరుస పెట్టి జబర్దస్త్కు వీడ్కోలు పలికారు. అయితే కిరాక్ ఆర్పీ ఈమధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కొందరు ఆర్పీని సపోర్ట్ చేయగా.. కొందరు మాత్రం మల్లెమాలకు మద్దతు పలికారు. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ కూడా జబర్దస్త్కు అధికారికంగా గుడ్ బై చెప్పేసింది. ఈ క్రమంలోనే ఆమె వీడ్కోలు ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
ఇక వీడ్కోలు ఇస్తున్న సందర్భంగా అనసూయ పేరిట ఓ స్కిట్ చేశారు. అందులో టీమ్ సభ్యులు అనసూయను బతిమాలారు. నెలలో మూడు రోజులు అయినా సమయం కేటాయించలేవా.. అని అడిగారు. అందుకు అనసూయ కష్టమని సమాధానం చెప్పింది. దీంతో కన్నీటితో ఆమెకు వీడ్కోలు పలికారు. జడ్జి ఇంద్రజ కూడా భావోద్వేగానికి గురైంది. అలాగే టీమ్ సభ్యులు కూడా జబర్దస్త్ పర్మినెంట్ అని.. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారని అన్నారు. ఇక అనసూయ జూన్ నెలలోనే తాను జబర్దస్త్కు గుడ్ బై చెబుతున్నట్లు పరోక్షంగా చెప్పింది.
తాను తన కెరీర్లో కీలకమైన నిర్ణయం తీసుకున్నానని.. ఇకపై కూడా మీ మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నానని.. గత నెలలో అనసూయ తెలియజేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె జబర్దస్త్ను విడిచిపెడుతుందని.. అందుకనే అలాంటి కామెంట్స్ చేసిందని అన్నారు. అయితే అదే నిజమైంది. ఆమె అధికారికంగా ఈ షోకు వీడ్కోలు పలికింది. ఆమెకు సినిమాల్లో ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని తెలిసింది. కనుకనే ఇకపై టీవీ షోలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ యాంకర్గా పేరున్న అనసూయ కూడా వెళ్లిపోవడంతో ఇక జబర్దస్త్కు ఉన్న ఇంకాస్త కళ కూడా తప్పినట్లే అని అంటున్నారు. మరి రేటింగ్స్ ఎలా వస్తాయో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…