Anasuya : బుల్లితెరపై ఎంతో సక్సెస్ ఫుల్గా కొనసాగుతున్న షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షోకు ఎంతో మంది కమెడియన్లు వచ్చి వెళ్లిపోయారు. అయితే నాగబాబు వెళ్లిన తరువాత మళ్లీ ఇన్ని రోజులకు జబర్దస్త్ లో ఒక భారీ కుదుపు వచ్చేసింది. రోజా, తరువాత కమెడియన్లు ఆది, సుధీర్, గెటప్ శ్రీను.. ఇలా అందరూ వరుస పెట్టి జబర్దస్త్కు వీడ్కోలు పలికారు. అయితే కిరాక్ ఆర్పీ ఈమధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కొందరు ఆర్పీని సపోర్ట్ చేయగా.. కొందరు మాత్రం మల్లెమాలకు మద్దతు పలికారు. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ కూడా జబర్దస్త్కు అధికారికంగా గుడ్ బై చెప్పేసింది. ఈ క్రమంలోనే ఆమె వీడ్కోలు ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
ఇక వీడ్కోలు ఇస్తున్న సందర్భంగా అనసూయ పేరిట ఓ స్కిట్ చేశారు. అందులో టీమ్ సభ్యులు అనసూయను బతిమాలారు. నెలలో మూడు రోజులు అయినా సమయం కేటాయించలేవా.. అని అడిగారు. అందుకు అనసూయ కష్టమని సమాధానం చెప్పింది. దీంతో కన్నీటితో ఆమెకు వీడ్కోలు పలికారు. జడ్జి ఇంద్రజ కూడా భావోద్వేగానికి గురైంది. అలాగే టీమ్ సభ్యులు కూడా జబర్దస్త్ పర్మినెంట్ అని.. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారని అన్నారు. ఇక అనసూయ జూన్ నెలలోనే తాను జబర్దస్త్కు గుడ్ బై చెబుతున్నట్లు పరోక్షంగా చెప్పింది.
తాను తన కెరీర్లో కీలకమైన నిర్ణయం తీసుకున్నానని.. ఇకపై కూడా మీ మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నానని.. గత నెలలో అనసూయ తెలియజేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె జబర్దస్త్ను విడిచిపెడుతుందని.. అందుకనే అలాంటి కామెంట్స్ చేసిందని అన్నారు. అయితే అదే నిజమైంది. ఆమె అధికారికంగా ఈ షోకు వీడ్కోలు పలికింది. ఆమెకు సినిమాల్లో ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని తెలిసింది. కనుకనే ఇకపై టీవీ షోలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ యాంకర్గా పేరున్న అనసూయ కూడా వెళ్లిపోవడంతో ఇక జబర్దస్త్కు ఉన్న ఇంకాస్త కళ కూడా తప్పినట్లే అని అంటున్నారు. మరి రేటింగ్స్ ఎలా వస్తాయో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…