Anasuya : జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తరువాత అనసూయకి చాలా బాగా ఫ్రీ టైం దొరికినట్లు ఉంది. లైగర్ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో ఆ సినిమాని పరోక్షంగా కామెంట్ చేస్తూ అనసూయ చేసిన ట్వీట్ పెద్ద సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ మీద ఎప్పటి నుంచో కోపం పెంచుకున్న అనసూయ ఫలానా అని పేరు చెప్పకుండా పరోక్షంగా ట్విట్టర్ ద్వారా లైగర్ చిత్రం డివైడ్ టాక్ రావడంతో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ రావడం ఒకోసారి లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.. అంటూ కామెంట్లు చేస్తూ రెచ్చిపోయింది. ఇక ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అసలే సినిమా పోయిందని బాధతో ఉన్న అభిమానులు అనసూయని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
ఈ సమాజం ఏమైపోయినా ఫర్వాలేదు నేను మాత్రం ఆంటీకి సపోర్ట్ అంటూ అనసూయ ట్విట్టర్ కి రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయని కామెంట్స్ తో అనసూయకి చిరాకు తెప్పించడం మొదలుపెట్టారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కామెంట్లతో మారుమోగిపోయింది. అనసూయ కూడా కామెంట్స్ చేసేవారికి ఘాటుగా సమాధానం చెబుతూ, ఆంటీ అంటే కేసు పెడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక అక్కడితో ఆగకుండా చెప్పిన విధంగానే ఆంటీ అన్న వాళ్ళ అందరి మీద కేసులు కూడా పెట్టింది. ఇలా వివాదాల్లో చిక్కుకోవడంతో అనసూయకు కొత్త సమస్య వచ్చిపడింది.
అనసూయ ఈవిధంగా వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో కొన్ని వారాల క్రితం అనసూయ సైన్ చేసిన ఒక సినిమా నుంచి తొలగిస్తున్నట్లు సదరు సినిమా నిర్మాత నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అనసూయ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప చిత్రంలో దాక్షాయని అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా సక్సెస్ ను అందుకుని నటీనటులు అందరికీ మంచి గుర్తింపు తెచ్చింది.
ఈ వివాదాలతో డైరెక్టర్ సుకుమార్ కూడా అనసూయ స్థానంలో మరో ఫీమేల్ క్యారెక్టర్ ను తీసుకోవడానికి ఆసక్తి చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి చిత్రం టైంలో విజయ్ దేవరకొండతో జరిగిన గొడవలను ఇంకా మనసులో పెట్టుకొని ఈ విధంగా ట్వీట్ చేయడం మంచి పద్ధతి కాదని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ కారణాల వలన అనసూయని పుష్ప 2 చిత్రం నుంచి తొలగించినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. పుష్ప చిత్రంతోపాటు అనసూయ మరొక తమిళ, మళయాళ చిత్రాలకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రాలపై ఎలాంటి క్లారిటీ రాలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…