Anasuya : జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తరువాత అనసూయకి చాలా బాగా ఫ్రీ టైం దొరికినట్లు ఉంది. లైగర్ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో ఆ సినిమాని పరోక్షంగా కామెంట్ చేస్తూ అనసూయ చేసిన ట్వీట్ పెద్ద సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ మీద ఎప్పటి నుంచో కోపం పెంచుకున్న అనసూయ ఫలానా అని పేరు చెప్పకుండా పరోక్షంగా ట్విట్టర్ ద్వారా లైగర్ చిత్రం డివైడ్ టాక్ రావడంతో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ రావడం ఒకోసారి లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.. అంటూ కామెంట్లు చేస్తూ రెచ్చిపోయింది. ఇక ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అసలే సినిమా పోయిందని బాధతో ఉన్న అభిమానులు అనసూయని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
ఈ సమాజం ఏమైపోయినా ఫర్వాలేదు నేను మాత్రం ఆంటీకి సపోర్ట్ అంటూ అనసూయ ట్విట్టర్ కి రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయని కామెంట్స్ తో అనసూయకి చిరాకు తెప్పించడం మొదలుపెట్టారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కామెంట్లతో మారుమోగిపోయింది. అనసూయ కూడా కామెంట్స్ చేసేవారికి ఘాటుగా సమాధానం చెబుతూ, ఆంటీ అంటే కేసు పెడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక అక్కడితో ఆగకుండా చెప్పిన విధంగానే ఆంటీ అన్న వాళ్ళ అందరి మీద కేసులు కూడా పెట్టింది. ఇలా వివాదాల్లో చిక్కుకోవడంతో అనసూయకు కొత్త సమస్య వచ్చిపడింది.
అనసూయ ఈవిధంగా వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో కొన్ని వారాల క్రితం అనసూయ సైన్ చేసిన ఒక సినిమా నుంచి తొలగిస్తున్నట్లు సదరు సినిమా నిర్మాత నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అనసూయ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప చిత్రంలో దాక్షాయని అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా సక్సెస్ ను అందుకుని నటీనటులు అందరికీ మంచి గుర్తింపు తెచ్చింది.
ఈ వివాదాలతో డైరెక్టర్ సుకుమార్ కూడా అనసూయ స్థానంలో మరో ఫీమేల్ క్యారెక్టర్ ను తీసుకోవడానికి ఆసక్తి చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి చిత్రం టైంలో విజయ్ దేవరకొండతో జరిగిన గొడవలను ఇంకా మనసులో పెట్టుకొని ఈ విధంగా ట్వీట్ చేయడం మంచి పద్ధతి కాదని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ కారణాల వలన అనసూయని పుష్ప 2 చిత్రం నుంచి తొలగించినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. పుష్ప చిత్రంతోపాటు అనసూయ మరొక తమిళ, మళయాళ చిత్రాలకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రాలపై ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…