Anasuya Bharadwaj : బుల్లితెర యాంకర్గా రాణిస్తూనే సినిమాల్లోనూ తన సత్తా చాటుతున్న యాంకర్ అనసూయను ఎల్లప్పుడూ వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఈ క్రమంలోనే ఆమె ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈమె మరోమారు వివాదంలో చిక్కుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ గేయాన్ని ఆమె కూర్చుని పాడిందంటూ.. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈ వివాదంపై స్పష్టతను ఇద్దామనుకుంది. కానీ నెటిజన్లు మాత్రం ఆమెను విమర్శించడం ఆపడం లేదు. అనసూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చుని పాడింది. అది ఆమె చేసిన తప్పు. వాస్తవానికి మన జాతీయ గీతం లేదా గేయం ఏదైనా సరే పాడినప్పుడు కచ్చితంగా వాటిని గౌరవిస్తూ లేచి నిలుచోవాల్సిందే. కానీ అనసూయ అలా చేయకుండా కూర్చోవడంపై వివాదం చెలరేగుతోంది.
ఇక గణతంత్ర దినోత్సవం అంటే అంబేద్కర్ బొమ్మ వేసుకోవాలి కానీ టీషర్టుపై గాంధీ బొమ్మ ఏమిటని కూడా కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో స్పందించిన అనసూయ కామెంట్ పెట్టింది.
అరే.. ఏందిరా భాయ్ మీ లొల్లి.. నేషనల్ యాంథెమ్ అంటారు. గాంధీకి, కాన్స్టిట్యూషన్ కి సంబంధమేందంటారు.. మరి జన గణ మణ ఏంది ? ఆగస్టు 15, 1947 అయితేనే 26 జనవరి 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా.. మాట్లాడుర్రి.. హ్యాపీ రిపబ్లిక్ డే మరి.. అంటూ అనసూయ పోస్ట్ పెట్టింది.
అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ ఆగడం లేదు. ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండే అనసూయకు ఇది తలనొప్పిగా మారింది. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…