Anasuya : గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విషయంపై వార్తలలో నిలుస్తూ ఉంటుంది అనసూయ. టీవీ9 యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయకు పాపులారిటీ వచ్చింది మాత్రం జబర్దస్త్ షో ద్వారానే. తన మాటలతోనే కాకుండా అందచందాలతోనూ అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ యాంకరమ్మ. అనసూయ వేసుకొనే పొట్టి బట్టలపై ఒక్కోసారి వివాదం చెలరేగుతూ ఉంటుంది. వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా అనసూయ గ్లామర్ షోతో అటు బుల్లితెర ప్రేక్షకులను, ఇటు వెండితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కొన్ని రోజుల క్రితం లైగర్ సినిమా ఫలితాన్ని ఉద్దేశిస్తూ.. పరోక్షంగా అనసూయ చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. లైగర్ చిత్రం డివైడ్ టాక్ రావడంతో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ రావడం ఒకోసారి లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.. అంటూ కామెంట్లు చేస్తూ రెచ్చిపోయింది. ఇక ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అసలే సినిమా పోయిందని బాధతో ఉన్న అభిమానులు అనసూయని టార్గెట్ చేస్తూ ఆంటీ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఓ రేంజ్లో ట్రోల్ చేయడం ప్రారంభించి దానిలో భాగంగానే ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో తనను ఆంటీ అన్న వారిపై కేసు నమోదు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ వివాదంపై నటుడు బ్రహ్మాజీ సైతం ఇన్డైరెక్ట్గా అనసూయపై సెటైర్లు వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వివాదం నెమ్మదిగా సద్దుమణిగింది.
అయితే మాటల ప్రవాహం యాంకర్ సుమ నిర్వహించే క్రేజీ కిచెన్ అనే వంటల కార్యక్రమంలో అనసూయ పాల్గొన్నది. ఈ సందర్భంగా అనసూయ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చాలా మంది తనకు వంటలు రావని అనుకుంటారని.. కానీ తాను చాలా బాగా వంట చేస్తానని చెప్పుకొచ్చింది. తాను ఎంత బాగా వండుతానో.. ఈ షో ద్వారా అందరికీ తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక సుమతో మాటల సందర్భంలో ఆంటీ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ షో ద్వారా అనసూయ స్పందిస్తూ.. నిజంగా చెప్పాలంటే.. అత్తా, పిత్తా అని పిలవడం నాకు అస్సలు నచ్చదు. చివరికి నా కోడలైనా సరే.. నన్ను అత్త అని పిలిస్తే ఊరుకోను. జస్ట్ అనసూయ.. అను.. అని పిలిస్తే సరిపోతుంది అని చెప్పింది. దీంతో మరోసారి ఆంటీ వివాదం తెరమీదకు వచ్చింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…