Allu Arjun : అల్లు అర్జున్ ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేసిన యాడ్స్ వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో ఆయన ర్యాపిడో బైక్ ట్యాక్సీ సంస్థకు యాడ్ చేశారు. అందులో ర్యాపిడోను బుక్ చేస్తే వెంటనే వస్తుందని.. ఆర్టీసీ బస్సు కూడా త్వరగా రాదని.. అన్నారు. దీంతో ఆ యాడ్ వివాదాస్పదం అయింది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ యాడ్పై స్వయంగా స్పందించారు. ఆ యాడ్ ను వెంటనే నిలిపి వేయాలని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన లీగల్ నోటీసులు పంపించారు.
దీంతో స్పందించిన ర్యాపిడో యాజమాన్యం ఆ యాడ్ను తొలగించి క్షమాపణలు చెప్పింది. ఆ యాడ్లో తెలంగాణ ఆర్టీసీని కించపరిచారని సజ్జనార్ పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఇక తాజాగా అల్లు అర్జున్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదాస్పదం అవుతోంది. అందులో నటుడు సుబ్బరాజ్కు అల్లు అర్జున్ పంచ్ ఇస్తాడు. దీంతో సుబ్బరాజు కాసేపు గాలిలో అలాగే ఉంటాడు.
అయితే అదే సందర్భంలో అల్లు అర్జున్ జొమాటో గురించి చెబుతూనే.. సౌత్ ఇండియన్ సినిమాలు అంటే అంతే.. అలా గాల్లో కాసేపు ఉండాలి.. అంటాడు. అయితే అల్లు అర్జున్ ఇలా అనడం అనేక మంది సౌత్ ఇండియన్ ఫ్యాన్స్కు నచ్చలేదు. ఓ వైపు హిందీ ఆడియన్స్ పుష్ప సినిమాకు గాను సౌత్ ఇండియన్ సినిమాలను మెచ్చుకుంటుంటే.. మరోవైపు అల్లు అర్జున్ ఇలా సౌత్ ఇండియన్ సినిమాలను కించ పరిచేలా అలా యాడ్లో నటించడం.. డైలాగ్ చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…