Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి తరువాత మళ్లీ వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ మూవీ హిందీలో ఎప్పుడో వచ్చేసింది. అక్కడ రిలీజ్ అయి హిట్ టాక్ను సొంతం చేసుకున్న పింక్ మూవీని రీమేక్ చేసి వకీల్ సాబ్ తీశారు.
ఇక తరువాత పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం కూడా రీమేక్ కావడం విశేషం. మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్గా భీమ్లా నాయక్ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే పవన్ తదుపరి చిత్రాన్ని కూడా ఇంకో మూవీకి రీమేక్గా తీయనున్నారు. అందులో సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు.
తమిళంలో హిట్ అయిన వినోదయ సీతమ్ అనే మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇందులో పవన్ పాత్ర నిడివి చాలా తక్కువట. సాయి ధరమ్ తేజ్ పాత్ర నిడివి ఫుల్ లెంగ్త్ ఉంటుందట. ఇక ఈ మూవీని చాలా త్వరగా షూటింగ్ చేసి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో పవన్ నటిస్తున్నందుకు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇది రీమేక్ మూవీ కావడంతోపాటు ఇందులో పవన్ పాత్ర నిడివి కూడా తక్కువే. కనుక అలాంటి సినిమాలో పవన్ నటించడం ఏంటి ? అని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్తో నటిస్తే మంచిదే. కానీ సినిమాలో ఇద్దరి పాత్రల నిడివి పూర్తి స్థాయిలో ఉండాలని అంటున్నారు. ఇక ఒరిజినల్ కథతో సినిమా తీయకుండా ఈ రీమేక్ల గోల ఏంటని కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అనేక భాషలకు చెందిన చిత్రాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు వాటిని ఆల్రెడీ చూసేస్తున్నారు. అలాంటి చిత్రాలను రీమేక్ చేయడం వల్ల కథ ముందుగానే తెలిసిపోతుంది కనుక థ్రిల్ ఏమీ ఉండదని.. పవన్ ఇప్పటికైనా ఒరిజినల్ కథతో సినిమా తీయాలని.. అప్పుడే ఆయన సినిమాలను చూస్తే థ్రిల్ కలుగుతుందని అంటున్నారు.
ఇక పవన్ నటిస్తున్న మరో రెండు చిత్రాలు.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్.. ఒరిజినల్ కథలే కావడం విశేషం. మరి పవన్ ఈ రెండు కాకుండా ముందు ముందు తీసే చిత్రాలు రీమేక్వే అవుతాయా.. ఒరిజినల్ కథతో సినిమాలను తీస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…