Akhanda 2 : నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తరువాత అఖండ మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. దీంతో బాలయ్య అభిమానుల జోరు మామూలుగా లేదు. అఖండ చాలా పెద్ద హిట్ కావడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ఏకంగా 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కరోనా అనంతరం వచ్చినప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా విజయంలో అదే కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు. అయితే అఖండ సినిమాకు సీక్వెల్గా అఖండ 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి చిత్ర యూనిట్ తాజాగా ఒక హింట్ అయితే ఇచ్చింది.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం అనిల్ రావిపూడితో 108వ సినిమా చేస్తారు. పక్కా కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోనర్లలో ఈ మూవీ ఉంటుంది. ఇక ఈ మూవీ కూడా అయ్యాకే అఖండ 2 ఉంటుందని తేల్చారు. తన 109వ సినిమాగా అఖండ 2 ఉంటుందని చెప్పేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీని 2024 ఎన్నికలకు ఒకటి లేదా రెండు నెలల ముందు రిలీజ్ చేస్తారని అంటున్నారు.
అప్పట్లో.. అంటే.. 2014లో ఎన్నికలకు ముందు వచ్చిన లెజెండ్ మూవీ టీడీపీకి కాస్త బూస్టింగ్ అయితే ఇచ్చింది కానీ మరీ అంత పెద్ద ప్రభావం చూపించలేదు. కానీ అఖండ 2 ద్వారా వచ్చే ఎన్నికలకు ఉపయోగపడే విధంగా సినిమాను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అందుకు గాను దర్శకుడు బోయపాటి ఇప్పటి నుంచే కథను చాలా పకడ్బందీగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే 2024 ఎన్నికల వరకు అఖండ 2 రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. అయితే 107, 108 సినిమాల తరువాత బాలకృష్ణ ఇంకేదైనా మూవీ చేస్తారా.. లేక నేరుగా అఖండ 2నే చేస్తారా.. అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ అఖండ 2కే ఆయన మొగ్గు చూపే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…