Apple Products : టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. మ్యాక్బుక్స్, ఐపాడ్స్, యాపిల్ పెన్సిల్, స్మార్ట్ కీబోర్డ్ తదితర ప్రొడక్ట్స్పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ స్టూడెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. బ్యాక్ టు స్కూల్ పేరిట అందుబాటులోకి తెచ్చిన ఈ ఆఫర్ సహాయంతో స్టూడెంట్లు మాత్రమే కాకుండా టీచర్లు, స్టూడెంట్ల తల్లిదండ్రులు కూడా యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్లో కొత్త మ్యాక్బుక్ ఎయిర్ ఎం2పై రూ.10వేల డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1పై కూడా రూ.10వేల డిస్కౌంట్ను అందిస్తున్నారు. ఇక మ్యాక్బుక్ ప్రొ 13, 14, 16 ఇంచుల మోడల్స్పై కూడా రూ.10వేల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీంతోపాటు ఐప్యాడ్స్ను రూ.54,900కు బదులుగా రూ.50,780 కి కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ప్రొ ధర రూ.71,900 ఉండగా రూ.68,300కి కొనవచ్చు.
ఇక ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్, ఐప్యాడ్ ప్రొ 11 ఇంచులు 3వ జనరేషన్, 12.9 ఇంచుల 5వ జనరేషన్ మోడల్స్పై కూడా ఇదే విధంగా డిస్కౌంట్లను పొందవచ్చు. ఎయిర్పాడ్స్ 3వ జనరేషన్ ను రూ.6400కి కొనవచ్చు. ఎయిర్పాడ్స్ ప్రొ ను రూ.12,200కు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలోనే మ్యాక్బుక్ లేదా ఐప్యాడ్ కొంటే ఎయిర్పాడ్స్, 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఉంటుందని యాపిల్ తెలియజేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…