Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంత పలు మూవీలకు వెంట వెంటనే సైన్ చేసింది. పిల్లలను కనాలని ప్లానింగ్ చేసుకుంది కానీ.. ఎక్కడో బెడిసికొట్టింది. దీంతో గతంలో నో చెప్పిన మూవీలకు కూడా ఇప్పుడు సమంత యెస్ అని చెబుతోంది. అందులో భాగంగానే ఆమె అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. విడాకుల ఒత్తిడి నుంచి వీలైనంత త్వరగా బయట పడాలని ఆలోచిస్తోంది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత తెలుగులో మరో వెబ్సిరీస్లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్తో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఆ సిరీస్లో ఎల్టీటీఈ మెంబర్గా అదిరిపోయే విధంగా నటించింది. అంతేకాదు.. ఆ సిరీస్లో ఆమె పలు బోల్డ్ సన్నివేశాల్లోనూ నటించి అలరించింది.
అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఆమెకు ఎంత పేరు తెచ్చిందో అంతే నష్టం కూడా చేసింది. సగం ఆ సిరీస్ వల్లే అక్కినేని ఫ్యామిలీ గుర్రుగా ఉన్నారని, అందుకనే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఒక రూమర్ ఇప్పటికీ వినిపిస్తోంది. అయితే అదంతా గతం. ఆమె విడాకులు తీసుకున్నాననే ఫీలింగ్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. దీంతో సినిమాలతో బిజీ కావాలని ఆమె ఆలోచిస్తోంది. దీని వల్ల మానసికంగా కొంచెం రిలీఫ్ పొందవచ్చని ఆమె భావన.
ఇక తాజా సమాచారం ప్రకారం ఆమె ఆహా సంస్థ త్వరలో రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్లో నటిస్తుందని తెలుస్తోంది. అందుకు ఆమె ఓకే కూడా చెప్పిందట. ఆహా మేనేజ్మెంట్ ఓ అద్బుతమైన సిరీస్ తీస్తున్నారని, అందులో సమంతను మెయిన్ రోల్లో చేయాలని అడిగారట. అయితే ఆమె ఓకే చెప్పిందా, లేదా.. తెలియదు కానీ.. ఆమెకు ఈ సిరీస్లో నటిస్తే భారీ ఎత్తున రెమ్యునరేషన్ ఇస్తామని కూడా ఆఫర్ చేశారట. దీంతో కష్టకాలంలో సమంతకు బంపర్ ఆఫర్ వచ్చినట్లయింది. మరి ఆమె దీనికి టెంప్ట్ అయి ఈ సిరీస్లో చేస్తుందా ? ఆహాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? అన్నది చూడాలి. ఇక సమంత రీసెంట్గా రెండు తెలుగు-తమిళ్ బైలింగువల్ ప్రాజెక్ట్స్కు ఓకే చెప్పింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…