Siddharth : హీరో సిద్ధార్థ్ 2003లో వచ్చిన బాయ్స్ అనే తమిళ్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే.. ఐఫా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. కానీ ఈ మధ్య అతడి సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. చాలాకాలం తర్వాత మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది సక్సెస్ అవలేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ అదితి రావు హైదరితో సిద్దార్థ్ లవ్లో పడ్డాడంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. ముంబైలోని ఓ సెలూన్ నుంచి ఇద్దరూ బయటకు వస్తుండగా కెమెరాల కంట పడింది. ఇంకేముందీ.. ఫొటోగ్రాఫర్లు వెంటనే వారిని ఫొటోలు తీస్తూ కెమెరాలు క్లిక్మనిపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్దార్థ్.. తనను ఫొటోలు తీయొద్దని హెచ్చరించాడట. ఇదిలా ఉండగా రీసెంట్ గా చెన్నైలో జరిగిన పొన్నియన్ సెల్వవన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఈ జంట కలిసి అటెండ్ అయ్యారు. అంతేకాదు అక్కడ వీళ్ళ ప్రవర్తించిన తీరు నడుచుకున్న విధానం కచ్చితంగా చూసిన వాళ్ళకి కాబోయే భార్య భర్తల్లాగే అనిపిస్తుంది.
అంతగా అట్రాక్ట్ చేసింది ఈ జంట. హాట్ లుక్స్ తో కనిపించారు. దీంతో అభిమానులు డౌట్ లేదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు. మరి చూడాలి సిద్ధార్థ్, హైదరి నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. లేదా అనేది.. అయితే సిద్ధార్థ్ కి గతంలో పెళ్లి జరిగిందనే విషయం చాలామందికి తెలీదు. 2003వ సంవత్సరంలో న్యూఢిల్లీలో తన పొరుగింట్లో నివాసం ఉంటున్న మేఘన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. వీరికి మొగ్లీ అనే కుమారుడు ఉండగా, ఆ బాలుడి బాధ్యతను సిద్ధార్థ్ తీసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…