Siddharth : హీరో సిద్ధార్థ్ 2003లో వచ్చిన బాయ్స్ అనే తమిళ్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే.. ఐఫా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. కానీ ఈ మధ్య అతడి సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. చాలాకాలం తర్వాత మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది సక్సెస్ అవలేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ అదితి రావు హైదరితో సిద్దార్థ్ లవ్లో పడ్డాడంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. ముంబైలోని ఓ సెలూన్ నుంచి ఇద్దరూ బయటకు వస్తుండగా కెమెరాల కంట పడింది. ఇంకేముందీ.. ఫొటోగ్రాఫర్లు వెంటనే వారిని ఫొటోలు తీస్తూ కెమెరాలు క్లిక్మనిపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్దార్థ్.. తనను ఫొటోలు తీయొద్దని హెచ్చరించాడట. ఇదిలా ఉండగా రీసెంట్ గా చెన్నైలో జరిగిన పొన్నియన్ సెల్వవన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఈ జంట కలిసి అటెండ్ అయ్యారు. అంతేకాదు అక్కడ వీళ్ళ ప్రవర్తించిన తీరు నడుచుకున్న విధానం కచ్చితంగా చూసిన వాళ్ళకి కాబోయే భార్య భర్తల్లాగే అనిపిస్తుంది.
అంతగా అట్రాక్ట్ చేసింది ఈ జంట. హాట్ లుక్స్ తో కనిపించారు. దీంతో అభిమానులు డౌట్ లేదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు. మరి చూడాలి సిద్ధార్థ్, హైదరి నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. లేదా అనేది.. అయితే సిద్ధార్థ్ కి గతంలో పెళ్లి జరిగిందనే విషయం చాలామందికి తెలీదు. 2003వ సంవత్సరంలో న్యూఢిల్లీలో తన పొరుగింట్లో నివాసం ఉంటున్న మేఘన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. వీరికి మొగ్లీ అనే కుమారుడు ఉండగా, ఆ బాలుడి బాధ్యతను సిద్ధార్థ్ తీసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…