Acharya Movie : కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం.. ఆచార్య.. అభిమానుల భారీ అంచనాల నడుమ ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ ఇంకో కీలకపాత్రను పోషించారు. అయితే ఈ మూవీకి గత నాలుగైదు రోజుల నుంచి నెగెటివ్ టాక్ ఎక్కువగా వస్తోంది. అయితే సినిమా విడుదలయ్యాక అది నిజమే అని చాలా మంది అన్నారు కూడా. దీంతో చిరంజీవి ఇంకో ఫ్లాప్ మూవీని తన ఖాతాలో వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవానికి ఆచార్య మూవీకి, కొరటాల శివ తెరకెక్కించిన మహేష్ బాబు మూవీ శ్రీమంతుడికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. దీంతో ఆచార్య సినిమాను చిరంజీవికి చెందిన శ్రీమంతుడు వెర్షన్ అని అంటున్నారు. ఇక రెండింటినీ ఒకసారి పరిశీలిస్తే..
శ్రీమంతుడు సినిమాలో హీరో పాత్ర ఒక పల్లెటూరుకు చెందుతుంది. హీరో తండ్రికి ఆ ఊరితో అనుబంధం ఉంటుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ ఒక మాట అనేసరికి పుట్టిన ఊరును బాగు చేసేందుకు హీరో అక్కడికి వెళ్తాడు. అయితే అప్పటికే గ్రామస్థులు అందరూ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోతుంటారు. కానీ వారికి హీరో ధైర్యం చెప్పి అక్కడ అభివృద్ధి పనులు చేస్తాడు. ఆ ఊరిని మారుస్తాడు. అక్కడి సమస్యలను పరిష్కిస్తాడు.
ఇక ఆచార్యలో ధర్మస్థలి అనే గ్రామం ఉంటుంది. దాన్ని కార్పొరేట్ శక్తులు దక్కించుకోవాలని చూస్తుంటాయి. సరిగ్గా ఆచార్య కూడా అక్కడికి చేరుకుని అక్కడి నుంచి వెళ్లిపోతున్న వారిని ఆపుతాడు. తరువాత వారి సమస్యలను పరిష్కరిస్తాడు. ఇలా శ్రీమంతుడు, ఆచార్య సినిమాలు.. రెండింటికీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అయితే శ్రీమంతుడు వచ్చినప్పుడు అది కొత్త కథ. ఊరిని దత్తత తీసుకోవడం అన్న కాన్సెప్ట్ ఆకట్టుకుంది. అందుకనే ఆ మూవీ హిట్ అయింది. కానీ ఇప్పుడు ఆచార్యలోనూ సరిగ్గా అదే కథను చూపించారు. అయితే కథనం చాలా నెమ్మదిగా సాగడం, పాత్రల చిత్రీకరణ చాలా బలహీనంగా ఉండడం, చిరంజీవి, రామ్ చరణ్లను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం.. వంటి అంశాల కారణంగా ఆచార్య ఫ్లాప్ అయింది. అలాగే సినిమాలోని పాత్రలకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ అవసరమే లేదని.. చిరు, చరణ్లను సాధారణంగా చూపించి ఉంటే బాగుండేదని.. అలాగే చిరంజీవి యవ్వనంలో ఉన్నప్పుడు గ్రాఫిక్స్ చేసి చూపించడం అసలే నచ్చలేదని.. అంటున్నారు. ఇవన్నీ సినిమా ఫ్లాప్ అవడం వెనుక ఉన్న కారణాలుగా పేర్కొంటున్నారు. అయితే ఎన్టీఆర్తో త్వరలో కొరటాల ఓ మూవీని చేయనున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…