Acharya Movie : ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లూసిఫర్ కు రీమేక్గా వచ్చిన ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకు భారీగా కలెక్షన్స్ రావాలంటే భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని అంతా భావించారు. కానీ ఆచార్య సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించినా కూడా కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయో అందరికీ తెలిసిందే. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా గాడ్ ఫాదర్ మొదటి రోజే రూ.38 కోట్లు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా లాంగ్ రన్ లో కూడా ఈస్థాయి వసూళ్లు రాలేదని తెలిసిందే. అయితే ఇప్పుడు అంతా ఆచార్య సినిమా ఎందుకు సక్సెస్ కాలేదనే విశ్లేషణలో పడ్డారు. ఎక్కువమంది అభిప్రాయం ఏంటంటే.. గాడ్ ఫాదర్ సినిమా విషయంలో చిరంజీవి ప్రమేయం ఎక్కువగా ఉంది. దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఇలా ప్రతి విషయంలో చిరంజీవి సలహాలు మరియు సూచనల మేరకు దర్శకుడు మోహన్ రాజా సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందట. కానీ ఆచార్య విషయంలో మాత్రం దర్శకుడు కొరటాల శివపై పూర్తి నమ్మకం ఉంచి చిరంజీవి ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వలేదట.
ఆచార్య సినిమా సన్నివేశాలు లేదా ఎడిటింగ్ ఏ ఒక్క విషయంలో కూడా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు. కానీ గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మాత్రం చిరంజీవి చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. చివరకు విలన్ పాత్రలో సత్యదేవ్ నటిస్తే బాగుంటుందని సూచించింది తానే అని చిరంజీవి పేర్కొన్నాడు. ఇంకా చాలా విషయాల్లో చిరంజీవి ఇన్ పుట్స్ ఉపయోగపడ్డాయని చిత్ర యూనిట్ అనధికారికంగా తెలిపారు. మొత్తానికి చిరు ఆచార్య డిజాస్టర్ నుంచి బయటకు వచ్చి గాడ్ ఫాదర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ కి కూడా మంచి పండుగ గిఫ్ట్ ఇచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…