Kaliyugam : ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. కలియుగ సత్యాలు ఇవి. కలియుగంలో ధనం వల్ల మాత్రమే మనకి గౌరవం లభిస్తుంది. కలియుగం ముందుకు వెళ్లే కొద్దీ మానవుల సమస్త సద్గుణాలు నశించిపోయి, దుర్గుణాలే ఎక్కువగా మానవుల్లో కనబడుతూ ఉంటాయి. కలియుగంలో వేలాది సంవత్సరాలుగా ఆచరిస్తున్న సనాతన ధర్మాలని వదిలి, పాషండ ధర్మం దిశగా వెళ్ళిపోయే వారి సంఖ్య పెరుగుతుంది. రోజు రోజుకీ మానవులలో ధర్మం, సత్యం, సౌచం, క్షమ, దయ, ఆయువు వంటి లక్షణాలు క్షీణిస్తాయి.
మొత్తం ప్రపంచమంతా కూడా భయంకర ప్రమాదంలో చిక్కుకొనిపోయే పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో కలగనున్నాయి. మనుషుల్లో స్వార్ధ గుణం పెరిగి, కపట వ్యవహారాలతో కాలం గడుపుతూ, ఇతరులకు హాని కలిగించే మార్గాలని వెతికే ప్రయత్నంలో అందరూ నిమగ్నమైపోతుంటారు. డబ్బుకి ప్రాధాన్యత పెరిగిపోతుంది. ధనహీనుడైన వాడు అసమర్ధుడిగా పరిగణించబడుతుంటాడు. పేదవారు అన్యాయాలకు బలైపోతారు.
సంస్కారహీనులై ధనం మదంతోనే సర్వం సాధించుకోవచ్చు అన్న భావంతో, అధికారాలని పొంది, తోటి వారి పట్ల అన్యాయాలు చేయడానికి కూడా వెనకాడరు. ప్రకృతి ప్రకోపం కారణంగా చలి, ఎండ, వర్షం, మంచు వంటివి ఎక్కువ ఈ లోకంలో ఉత్పాతాలకి కారణం అవుతాయి. ధర్మం నశించిపోతుంది. పాలకులే దొంగ పనులకు పాల్పడుతుంటారు. అది చూసిన ప్రజలు కూడా అబద్దాలని ఆశ్రయించి, హింసను ప్రోత్సహిస్తూ నీచంగా బతుకుతారు.
పైగా అది గొప్ప జీవన విధానంగా భావిస్తూ ఉంటారు. కలియుగంలో సోమరులై, మంద బుద్ధి కలవారై, అల్పాయిష్కులై, భయంకరమైన రోగాలతో నిస్సహాయులు అవుతుంటారు. కలియుగ కష్టాలని అధిగమించగలిగే శక్తి కేవలం నిత్యం భగవంతుడని ఆరాధించడం వలనే కలుగుతుంది. భగవత్ ధ్యానం చేసుకోవడం, మానసిక శుద్ధితో జీవిస్తూ స్వామిని సేవించాలనే సందేశాన్ని భాగవతం చెప్పింది. ఇలానే కలియుగం కష్టాలని అధిగమించొచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…