Honey And Lemon Water : చాలామంది ఆహారపు అలవాట్లుని మార్చేసుకున్నారు. జీవన విధానం కూడా మారిపోయింది. దాంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎంతోమంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇలా చేయండి. వెంటనే సులభంగా బరువు తగ్గిపోవడానికి అవుతుంది. తేనె తీసుకుంటే కొవ్వు కరిగిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకే ఉదయం లేచిన వెంటనే కొంచెం నీళ్లల్లో తేనె, నిమ్మరసం వేసుకొని తీసుకుంటూ ఉంటారు.
కానీ నిజానికి కొవ్వుని కరిగించే గుణం తేనెలో లేదు. ఒక గ్లాసు నీళ్లల్లో తేనె, నిమ్మరసం వేసుకొని తీసుకుంటే 115 క్యాలరీని మనం తీసుకున్నట్లు అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే, ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా, కేవలం తేనె, నిమ్మరసం తీసుకుంటారు. ఆ తర్వాత వర్క్ చేసుకుంటూ ఉంటారు. అదే ఒకవేళ టిఫిన్ తిని అప్పుడు వర్క్ చేసుకున్నట్లయితే, ఒంట్లో ఉండే కొవ్వు కరగదు. మనం తీసుకునే క్యాలరీలు ఖర్చు అవుతాయి తప్ప లోపల ఏ కొవ్వు కూడా కరగదు.
అదే కేవలం వట్టి తేనె, నిమ్మరసం తీసుకున్నట్లయితే తక్కువ క్యాలరీలు శరీరంలోకి వెళ్తాయి. కాబట్టి మనం పని చేసుకున్నప్పుడు, ఆ కేలరీలతోపాటుగా అదనపు కొవ్వు కరుగుతుంది. ఇలా కొవ్వు కరుగుతుంది. బరువు కూడా తగ్గిపోతారు. అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే.. తేనె తాగడం వలన బరువు తగ్గిపోయాను. తేనె తాగడం వలన కొవ్వు కరిగింది అని అనుకుంటారు.
తేనెకి బదులుగా ఇంకేమైనా తీసుకున్నా కూడా అదే జరుగుతుంది, తేనె నీళ్లకి బదులుగా సమానమైన క్యాలరీలను ఇచ్చే మజ్జిగ కానీ చెరుకు రసం కానీ జ్యూస్ కానీ ఇలా ఏం తీసుకున్న సరే, ఇలానే పనిచేస్తుంది తప్ప తేనె వలన మ్యాజిక్ ఏమీ జరగదు. అయితే మనం తక్కువ క్యాలరీలు తీసుకోవడం వలన ఆటోమేటిక్ గా కొవ్వు కరుగుతోంది తప్ప తేనె లేదంటే చెరుకు రసం లేదంటే బెల్లం ఇవేమీ కూడా మన శరీరానికి మేలు చేయడం లేదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…