Intermittent Fasting : ఉపవాసం.. దీన్నే ఇంగ్లిష్లో ఫాస్టింగ్ అని కూడా అంటారు. ఫాస్టింగ్ చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతుంటారు. అయితే ఫాస్టింగ్ అనేది వారంలో ఒకటి లేదా రెండు రోజులు చేస్తారు. దీంతో ఆ రోజు మొత్తం ఏమీ తినకుండా ఉంటారు. అయితే అలా కాకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయవచ్చు. దీంతోనూ మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే.. తినే తిండిని ఆపి ఫాస్టింగ్ ఉండడం అన్నమాట. దీన్ని అనేక రకాలుగా చేయవచ్చు. అంటే.. రోజు మొత్తంలో కేవలం 8 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకోవాలన్నమాట. మిగిలిన 16 గంటలు ఎలాంటి ఆహారం తీసుకోరాదు. కేవలం నీరు మాత్రమే తాగవచ్చు.
ఆ 8 గంటల సమయంలో మీకు నచ్చిన, మీకు ఇష్టమొచ్చిన ఆహారాన్ని తినవచ్చు. ఇక ఆ 8 గంటలను మీరు రోజులో ఎప్పుడైనా పాటించవచ్చు. అంటే.. ఉదయం 8 గంటలకు తినడం ప్రారంభించారనుకుంటే.. సాయంత్రం 4 గంటల వరకే తినాలి. ఆ తరువాత ఏమీ తినరాదు. మళ్లీ మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఫాస్టింగ్ ఉండాలి. దీన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు.
అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 8 గంటలు మాత్రమే తినాలని ఏమీ లేదు. కొందరు దీన్ని 6, 4 గంటలు పాటిస్తారు. అంటే.. 24 గంటల్లో 6 లేదా 4 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుంటారన్నమాట. మిగిలిన 18 లేదా 20 గంటల పాటు ఏమీ తినరన్నమాట. ఇలా కూడా కొందరు చేస్తారు. దీన్ని కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే అంటారు. అయితే పైన చెప్పిన మూడు పద్ధతుల్లో ఏ రకమైన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా సరే.. కింద చెప్పిన లాభాలు కలుగుతాయి. అవేమిటంటే..
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల డయాబెటిస్ పూర్తిగా అదుపులోకి వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఫాస్టింగ్ వల్ల అధిక బరువును త్వరగా తగ్గించుకోవడంతోపాటు తగ్గిన బరువును నియంత్రణలో కూడా ఉంచుకోవచ్చట. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…