Kanipakam Temple Facts : మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరుమలకు ఎంతో పేరు ఉంది. అక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వరున్ని పూజిస్తే సకల దోషాలు పోతాయని, అంతా శుభమే కలుగుతుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే తిరుపతికి వెళ్లే చాలా మంది దర్శించుకునే ప్రాంతాల్లో కాణిపాకం కూడా ఒకటి. తిరుమల వెంకన్న దేవుడికి ఎంత పేరు ఉందో కాణిపాకం వినాయకుడికి కూడా అంతే పేరుంది. ఈ క్రమంలోనే కాణిపాక ఆలయ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాణిపాకంలో వినాయకున్ని ఎవరూ ప్రతిష్టించలేదు. ఆయన ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చరిత్ర చెబుతోంది. అందులో భాగంగానే ఓ కథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది.. అదేమిటంటే.. ఒకప్పుడు ఒక గ్రామంలో మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారి వ్యవసాయ భూమిలో ఎప్పుడూ పంటలు బాగా పండేవి. అయితే ఒకసారి వారి వ్యవసాయ భూమిలో ఉండే బావిలో నీరు ఎండిపోతుండడాన్ని వారు గమనించారు. దీంతో వారు ఆ బావిని కొంత తవ్వితే నీరు వస్తుందని భావించి వెంటనే ఆ బావిని తవ్వడం మొదలు పెట్టారు. అలా వారు కొంత తవ్వగానే ఓ రాయి తగిలింది. దీంతో ఆ బావినిండా రక్తం ఊరుతుంది. క్రమ క్రమంగా ఆ బావి రక్తంతో నిండుతుంటుంది. అయితే అదే సమయంలో వారికి బావిలో వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. దీంతో వారు తవ్వడం ఆపి విగ్రహాన్ని పూజిస్తారు. ఈ క్రమంలో వెంటనే వారికి ఉన్న వైకల్యాలు పోయి వారు మామూలు మనుషులుగా మారుతారు.
అలా ఆ విషయం ఆ గ్రామంలోని ఇతర ప్రజలందరికీ తెలుస్తుంది. దీంతో వారు కూడా వినాయకున్ని పూజించడం మొదలు పెడతారు. ఈ క్రమంలో వారు స్వామి వారికి కొట్టే కొబ్బరికాయల నుంచి వచ్చే నీరు ఆ గ్రామం అంతా వ్యాపిస్తుంది. దీంతో వారి పంటలు పచ్చగా పండుతాయి. గ్రామం సుభిక్షంగా మారుతుంది. అలా వ్యవసాయ భూముల్లో నీరు ప్రవహించే సరికి ఆ గ్రామం కాణిపాకం అయింది. కాగా కాణిపాకం ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారని చరిత్ర చెబుతోంది.
కాణిపాకంలో వినాయకుడి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. స్వామి వారి విగ్రహం రోజూ కొంత పరిమాణం పెరుగుతుంది. అవును, మీరు విన్నది నిజమే. అందుకు సాక్ష్యం ఆయనకు ధరించే తొడుగులే. ఒకప్పుడు భక్తులు ఆయన విగ్రహానికి చేయించిన తొడుగులు ఇప్పుడు సరిపోవడం లేదు. విగ్రహం సైజు పెరిగింది. కావాలంటే భక్తులు ఆలయంలో ఉండే స్వామి వారి తొడుగులను చూడవచ్చు. అవే ఆయన విగ్రహం పెరుగుతుందనడానికి సాక్ష్యాలు..! ఇక స్వామి వారి విగ్రహానికి 50 సంవత్సరాల కిందట చేయించిన వెండి కవచం కూడా ఇప్పుడు సరిపోవడం లేదట. ఈ ఒక్క ఆధారం చాలు.. ఆయన విగ్రహం పరిమాణం పెరుగుతుందని చెప్పడానికి..!
కాణిపాకంలో వినాయకుడి విగ్రహం బావిలోనే ఉంటుంది. అయితే ఆ బావిలోని నీరు ఎప్పటికీ ఎండిపోదు. దీంతో ఆ బావి నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా అందిస్తారు. అలాగే కాణిపాక వినాయకుడికి సత్యానికి మారు పేరు అనే మరో గుర్తింపు కూడా ఉంది. చాలా మంది తప్పులు చేసిన వారిని ఇక్కడికి తీసుకువచ్చి ఆలయం ఎదుట ఉన్న కోనేట్లో స్నానం చేయిస్తే వారు తాము చేసిన తప్పులను ఒప్పుకుంటారని భక్తుల విశ్వాసం. అలాగే ఆలయ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంటుంది. అందులో స్వామి వారి వాహనమైన ఎలుక ఉంటుందట. దానికి ఇష్టమైన ఏదైనా పదార్థం వేసి స్వామి వారిని ప్రార్థిస్తే అనుకున్నవి జరుగుతాయని భక్తులు నమ్ముతారు.
కాణిపాకం ఆలయంలో ఎప్పుడూ ఒక పాము తిరుగుతుంటుందట. అది ఎవరికీ అపకారం చేయదట. అది దేవతా సర్పమని భక్తులు నమ్ముతారు. ఇక కాణిపాకం ఆలయానికి వెళ్లాలంటే.. తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. అదే చిత్తూరు నుంచి అయితే ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. చంద్రగిరి నుంచి కూడా భక్తులు వెళ్లవచ్చు. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు బాగా లభిస్తాయి. కాణిపాక క్షేత్రం చిత్తూరుకు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే తిరుపతి నుంచి అయితే కాణిపాకంకు సుమారుగా 68 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…