Gongura Mutton Curry : మటన్తో చాలా మంది అనేక రకాల వంటకాలను చేసుకుని తింటారు. కానీ దాన్ని గోంగూరతో కలిపి వండితే భలే రుచిగా ఉంటుంది. మసాలాలు, ఇతర పదార్థాలు వేసి వేడి వేడిగా వండితే గోంగూర మటన్ భలే మజాగా అనిపిస్తుంది. అంతేకాదు.. రెండింటిలోనూ ఉండే పోషకాలు కూడా మనకు లభిస్తాయి. మరి గోంగూర మటన్ను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
గోంగూర మటన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అర కిలో, గోంగూర – 3 కట్టలు, పచ్చిమిర్చి – 6, పసుపు – 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, ఉల్లిపాయ – 1, నూనె – 1 టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్లు, ధనియాల పొడి – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
గోంగూర మటన్ తయారు చేసే విధానం..
మటన్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి అన్నింటినీ కుక్కర్లో వేయాలి. అనంతరం అందులో కొద్దిగా నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పాన్ తీసుకుని అందులో నూనె పోసి వేడెక్కాక.. ఉల్లిపాయలు, గరం మసాలా వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కట్ చేసిన పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి సన్నని మంట మీద ఉడకించాలి. అనంతరం ఉడికిన మటన్, తగినంత ఉప్పు వేసి కలిపి 10 నిమిషాల పాటు ఉడికించి దించాలి. అంతే.. వేడి వేడి గోంగూర మటన్ రెడీ అవుతుంది. దాన్ని అన్నం లేదా చపాతీలతో లాగించవచ్చు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…