Taking Pills : మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. హాస్పిటల్కు వెళ్లి డాక్టర్లచే పరీక్ష చేయించుకుని వారు రాసే మందులను తెచ్చుకుని మింగుతుంటాం. దీంతో ఆ అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. వాటి నుంచి మనం బయటపడతాం. అయితే దాదాపుగా ఏ టానిక్ లేదా మందు బిళ్ల అయినా సరే.. చేదుగానే ఉంటుంది. దీంతో ఆ చేదు మందులను మింగాలంటే కొందరు జంకుతుంటారు. అయితే అసలు నిజానికి ఏ మందు బిళ్లలనైనా ఎలా మింగాలో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.
మందు బిళ్లను మింగేందుకు మనకు రెండు ఉత్తమమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి.. ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి. అందులో తగింత నీరు నింపుకోవాలి. మీరు మింగాలనుకునే టాబ్లెట్ను నాలుక మీద పెట్టుకోవాలి. రుచికళిలకు దూరంగా నాలుకపై టాబ్లెట్ను ఉంచాలి. లేదంటే చేదు తగులుతుంది. అనంతరం బాటిల్ ఓపెనింగ్ను పెదాలకు దగ్గరగా పెట్టుకుని పెదాలను ఆ ఓపెనింగ్ చుట్టూ బిగించి నీటిని తాగాలి. అలా నోట్లోకి గాలి చొరబడకుండా టాబ్లెట్ను మింగాలి.
ఇక టాబ్లెట్లను మింగేందుకు మరొక పద్ధతి.. టాబ్లెట్ను నాలుక మీద పెట్టుకోవాలి. నీళ్లను ఒక సిప్ వేసి కొంత నీటిని నోట్లోకి తీసుకోవాలి. కానీ టాబ్లెట్ను మింగకూడదు. గడ్డాన్ని కొద్దిగా కిందకు దించాలి. ఆ తరువాత తల కిందకు వంగగానే టాబ్లెట్ను, నీటిని కలిపి మింగాలి. ఇప్పుడు చెప్పిన రెండు పద్ధతులు టాబ్లెట్లను మింగేందుకు అనువైనవి. వీటి ద్వారా 80 శాతం వరకు టాబ్లెట్లను చాలా సులభంగా మింగవచ్చు. అయితే టాబ్లెట్లను బాగా మింగగలిగే వారు ఈ పద్ధతులను పాటించాల్సిన పనిలేదు. తమకు తోచినట్లుగా టాబ్లెట్లను మింగవచ్చు. అదే టాబ్లెట్లను మింగేందుకు జంకే వారు ఈ పద్ధతులను పాటించవచ్చు. కానీ ఈ కొత్త పద్ధతులను పాటించే ముందు ఎందుకైనా మంచిది.. జాగ్రత్త వహించండి.. పక్కనే ఎవరైనా ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి టాబ్లెట్లు గొంతులో ఇరుక్కుని (చోకింగ్) ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక టాబ్లెట్లను మింగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…