Guava : రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదని చెబుతుంటారు. అయితే నిజానికి యాపిల్ పండ్లు చాలా ఖరీదైనవి. అవి అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం సంపన్నులు మాత్రమే నిత్యం తినగలిగిన పండ్లు అవి. అయితే యాపిల్ పండ్లను తినలేకపోయినా.. మనకు సరిగ్గా వాటిలాంటి లాభాలనిచ్చే పండు కూడా ఉంది. అదే జామపండు.. జామకాయ.. ఎలా పిలిచినా సరే.. వీటిని తినడం వల్ల మనకు సరిగ్గా యాపిల్ పండును తిన్న లాభాలే కలుగుతాయి. ఈ క్రమంలోనే జామకాయలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
జామకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సహజంగానే చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం బాధిస్తుంటాయి. అయితే ఆ సమస్యల నుంచి బయట పడాలంటే జామకాయలను తినాలి. దీంతో ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరితే గుండె జబ్బులు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే శరీరంలో ఉన్న కొవ్వును కరిగించేందుకు జామకాయలను తినాలి. అలాగే హైబీపీ రాకుండా ఉండాలన్నా.. బీపీ నియంత్రణలో ఉండాలన్నా జామకాయలను రోజూ తినాలి.
దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడేవారు జామకాయలను తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి దంతాలను దృఢంగా చేస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారకుండా, చిగుళ్లు వాపులకు గురికాకుండా చూస్తుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు నిత్యం జామకాయలను తింటే షుగర్ అదుపులో ఉంటుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే జామకాయల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది.
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…