Pista Kulfi : చాలా మంది సహజంగానే ఐస్క్రీములను ఎవరైనా తింటారు. కానీ వెరైటీగా కుల్ఫీలను తినేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నిజానికి కుల్ఫీలు కూడా ఐస్క్రీములలాగే ఉంటాయి. కానీ టేస్ట్ వేరేలా ఉంటుంది. అయితే వీటిని తినేందుకు ఎక్కడికో బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే కుల్ఫీలను చేసుకోవచ్చు. మరి పిస్తాలతో కుల్ఫీలను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
పిస్తా కుల్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – 1 లీటర్, చక్కెర – 250 గ్రాములు, బ్రెడ్ – ఒక ముక్క (చివర్లు కత్తిరించుకోవాలి), బాదంపప్పు – 20 (నీటిలో నానబెట్టి పొట్టు తీసినవి), పిస్తాపప్పు – అర కప్పు (పొట్టు తీసినవి, పలుకులుగా చేయాలి), యాలకులు – 4, కుంకుమ పువ్వు – 2, 3 రెబ్బలు.
పిస్తా కుల్ఫీ తయారు చేసే విధానం..
లీటర్ పాలను అర లీటర్ అయ్యే వరకు మరిగించాలి. పాలు చల్లారాక అందులో చక్కెర, బ్రెడ్, బాదం పప్పు పొడి, పిస్తాపప్పు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. కుల్ఫీ మౌల్డ్లో సిల్వర్ ఫాయిల్ సెట్ చేయాలి. అందులో ముందుగా కలుపుకున్న మిశ్రమం పోయాలి. ఐస్క్రీం పుల్లను పెట్టుకోవాలి. 12 గంటల పాటు కుల్ఫీ మౌల్డ్ని డీప్ ప్రిజ్లో ఉంచాలి. అంతే.. చల్ల చల్లని పిస్తా కుల్ఫీ తయారవుతుంది. కుల్ఫీ మౌల్డ్స్ను వేడి నీటిలో ముంచితే కుల్ఫీలు సులభంగా బయటకు వస్తాయి. వాటిని చల్ల చల్లగా ఉన్నప్పుడే తినాలి. అయితే కుల్ఫీ మౌల్డ్స్ ఇంట్లో లేకపోతే చిన్న చిన్న గ్లాసులలో ఆ మిశ్రమం పోసి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు. దీంతో కుల్ఫీలు రెడీ అవుతాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…