Natural Home Remedies For Acidity : అసిడిటీ సమస్య అనేది చాలా మందికి తరచుగానే వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం, రాత్రి పూట ఆలస్యంగా తినడం లేదా అతిగా భోజనం చేయడం, సరిగ్గా జీర్ణం అవకపోవడం, ఒత్తిడి, ఆందోళన, పలు రకాల మెడిసిన్లను వాడడం వంటి పలు కారణాల వల్ల చాలా మందికి అసిడిటీ వస్తుంది. దీంతో కడుపులో మంటగా ఉంటుంది. అదే తగ్గే వరకు తీవ్రమైన అసౌకర్యంగా ఉంటుంది. దీంతో కడుపులో మంటతో చాలా మంది నానా అవస్థలు పడతారు.
అసిడిటీ సమస్య రాగానే చాలా మంది మెడికల్ షాపుకు వెళ్లి అంటాసిడ్ ట్యాబ్లెట్లను లేదా గ్యాస్ ట్యాబ్లెట్లను తెచ్చి వేసుకుంటారు. దీంతో సమస్య తగ్గుతుంది. కానీ దీర్ఘకాలికంగా వీటిని వాడడం అంత మంచిది కాదు. వీటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కనుక అసిడిటీని సహజసిద్ధమైన మార్గంలో తగ్గించుకునే పనిచేయాలి. ఇందుకు గాను కింద చెప్పబోయే ఇంటి చిట్కాలు ఎంతగానో పనిచేస్తాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపులో మంట ఉన్నవారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను అలాగే నమిలి మింగాలి. లేదా ఒక టీస్పూన్ అల్లం రసం సేవించవచ్చు. అల్లం ముక్కను వేసి మరిగించిన నీళ్లను తాగుతున్నా కూడా అసిడిటీ తగ్గిపోతుంది. అలాగే కడుపులో మంటను తగ్గించేందుకు కలబంద జ్యూస్ కూడా అద్బుతంగా పనిచేస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు ఈ జ్యూస్ను కనీసం 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే కడుపులో మంట సమస్య రాదు.
ఇక భోజనం చేసిన అనంతరం గుప్పెడు సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగుతున్నా కూడా అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పాలు కూడా అసిడిటీని తగ్గించగలవు. కానీ చల్లని పాలను తాగాల్సి ఉంటుంది. వేడి పాలు అయితే అసిడిటీని పెంచుతాయి. చల్లని పాలు అసిడిటీని తగ్గిస్తాయి. ఇక కొబ్బరి నీళ్లను తాగుతున్నా కూడా అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటి పండు సహజసిద్ధమైన అంటాసిడ్లా పనిచేస్తుంది. కనుక కడుపులో మంట ఉన్నవారు పూటకు ఒక అరటి పండును తింటుంటే సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. ఇలా ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…