Natural Home Remedies For Acidity : అసిడిటీ సమస్య అనేది చాలా మందికి తరచుగానే వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం, రాత్రి పూట ఆలస్యంగా తినడం లేదా అతిగా భోజనం చేయడం, సరిగ్గా జీర్ణం అవకపోవడం, ఒత్తిడి, ఆందోళన, పలు రకాల మెడిసిన్లను వాడడం వంటి పలు కారణాల వల్ల చాలా మందికి అసిడిటీ వస్తుంది. దీంతో కడుపులో మంటగా ఉంటుంది. అదే తగ్గే వరకు తీవ్రమైన అసౌకర్యంగా ఉంటుంది. దీంతో కడుపులో మంటతో చాలా మంది నానా అవస్థలు పడతారు.
అసిడిటీ సమస్య రాగానే చాలా మంది మెడికల్ షాపుకు వెళ్లి అంటాసిడ్ ట్యాబ్లెట్లను లేదా గ్యాస్ ట్యాబ్లెట్లను తెచ్చి వేసుకుంటారు. దీంతో సమస్య తగ్గుతుంది. కానీ దీర్ఘకాలికంగా వీటిని వాడడం అంత మంచిది కాదు. వీటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కనుక అసిడిటీని సహజసిద్ధమైన మార్గంలో తగ్గించుకునే పనిచేయాలి. ఇందుకు గాను కింద చెప్పబోయే ఇంటి చిట్కాలు ఎంతగానో పనిచేస్తాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపులో మంట ఉన్నవారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను అలాగే నమిలి మింగాలి. లేదా ఒక టీస్పూన్ అల్లం రసం సేవించవచ్చు. అల్లం ముక్కను వేసి మరిగించిన నీళ్లను తాగుతున్నా కూడా అసిడిటీ తగ్గిపోతుంది. అలాగే కడుపులో మంటను తగ్గించేందుకు కలబంద జ్యూస్ కూడా అద్బుతంగా పనిచేస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు ఈ జ్యూస్ను కనీసం 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే కడుపులో మంట సమస్య రాదు.
ఇక భోజనం చేసిన అనంతరం గుప్పెడు సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగుతున్నా కూడా అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పాలు కూడా అసిడిటీని తగ్గించగలవు. కానీ చల్లని పాలను తాగాల్సి ఉంటుంది. వేడి పాలు అయితే అసిడిటీని పెంచుతాయి. చల్లని పాలు అసిడిటీని తగ్గిస్తాయి. ఇక కొబ్బరి నీళ్లను తాగుతున్నా కూడా అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటి పండు సహజసిద్ధమైన అంటాసిడ్లా పనిచేస్తుంది. కనుక కడుపులో మంట ఉన్నవారు పూటకు ఒక అరటి పండును తింటుంటే సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. ఇలా ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…