Jio Rs 198 Prepaid Plan : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. తక్కువ ధరకే అన్లిమిటెడ్ 5జిని వాడుకునేలా ఈ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు గాను కస్టమర్లు రూ.198తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కస్టమర్లకు అన్లిమిటెడ్ 5జి మొబైల్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులుగా ఉంది.
జియో అందిస్తున్న రూ.198 ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2 జీబీ 4జి డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా అందిస్తారు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్ను ఉచితంగా వాడుకోవచ్చు. ఇక జియోలో అన్లిమిటెడ్ 5జి యాక్సెస్తో లభిస్తున్న అత్యంత చవకైన ప్లాన్ ఇదే కావడం విశేషం. అయితే దీన్ని నెలలో 2 రోజులు రీచార్జి చేసుకోవాలి. దీంతో కస్టమర్లకు రూ.396 అవుతుంది. కానీ రూ.349 చెల్లిస్తే ఇదేలాంటి బెనిఫిట్స్తో 28 రోజుల వాలిడిటీ పొందవచ్చు. మరలాంటప్పుడు జియో రూ.198 ప్లాన్ను ఎందుకు అందుబాటులోకి తెచ్చింది అన్నది అర్థం కాని విషయం.
జియో రూ.349 ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ 5జి డేటాను వాడుకోవచ్చు. 4జి డేటా అయితే రోజుకు 2జీబీ డేటాను వాడుకోవచ్చు. దీంట్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఉచిత జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. అయితే ఎయిర్టెల్లో ఇదే ప్లాన్ కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంది. ఎయిర్టెల్లో ఇందుకు కస్టమర్లు రూ.379 చెల్లించాలి. కానీ దీంట్లో 30 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇక బెనిఫిట్స్ మాత్రం జియోలో రూ.349 ప్లాన్ను పోలి ఉంటాయి. ఇలా కస్టమర్లు తమకు కావల్సిన ప్లాన్ను రీచార్జి చేసుకుని ఆ మేర అన్లిమిటెడ్ 5జి డేటాను యాక్సెస్ చేయవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…