Jio Rs 198 Prepaid Plan : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. తక్కువ ధరకే అన్లిమిటెడ్ 5జిని వాడుకునేలా ఈ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు గాను కస్టమర్లు రూ.198తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కస్టమర్లకు అన్లిమిటెడ్ 5జి మొబైల్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులుగా ఉంది.
జియో అందిస్తున్న రూ.198 ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2 జీబీ 4జి డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా అందిస్తారు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్ను ఉచితంగా వాడుకోవచ్చు. ఇక జియోలో అన్లిమిటెడ్ 5జి యాక్సెస్తో లభిస్తున్న అత్యంత చవకైన ప్లాన్ ఇదే కావడం విశేషం. అయితే దీన్ని నెలలో 2 రోజులు రీచార్జి చేసుకోవాలి. దీంతో కస్టమర్లకు రూ.396 అవుతుంది. కానీ రూ.349 చెల్లిస్తే ఇదేలాంటి బెనిఫిట్స్తో 28 రోజుల వాలిడిటీ పొందవచ్చు. మరలాంటప్పుడు జియో రూ.198 ప్లాన్ను ఎందుకు అందుబాటులోకి తెచ్చింది అన్నది అర్థం కాని విషయం.
జియో రూ.349 ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ 5జి డేటాను వాడుకోవచ్చు. 4జి డేటా అయితే రోజుకు 2జీబీ డేటాను వాడుకోవచ్చు. దీంట్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఉచిత జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. అయితే ఎయిర్టెల్లో ఇదే ప్లాన్ కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంది. ఎయిర్టెల్లో ఇందుకు కస్టమర్లు రూ.379 చెల్లించాలి. కానీ దీంట్లో 30 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇక బెనిఫిట్స్ మాత్రం జియోలో రూ.349 ప్లాన్ను పోలి ఉంటాయి. ఇలా కస్టమర్లు తమకు కావల్సిన ప్లాన్ను రీచార్జి చేసుకుని ఆ మేర అన్లిమిటెడ్ 5జి డేటాను యాక్సెస్ చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…