Truck Driver Rajesh : సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మందికి ఈ రోజుల్లో ఉపాధి లభిస్తోంది. అందులో వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకోవడమే కాక నెల నెలా రెండు చేతులా సంపాదిస్తున్నారు. అందుకు యూట్యూబ్తోపాటు ఇన్స్టాగ్రామ్ కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలా సోషల్ మీడియానే స్వయం ఉపాధిగా మలుచుకున్నవారు చాలా మందే ఉంటున్నారు. నెల నెలా వారు కొన్ని వేల డాలర్లను సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి ఒక వ్యక్తి గురించే. ఇంతకీ అతను ఎవరంటే..
జార్ఖండ్లోని రామ్ఘర్ అనే ప్రాంతానికి చెందిన రాజేష్ రావణి వృత్తి రీత్యా ఒక లారీ డ్రైవర్. గత 20 ఏళ్ల నుంచి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను లారీ డ్రైవర్గా నెలకు దాదాపుగా రూ.25వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తున్నాడు. కానీ ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని ద్వారా నెలకు రూ.5 లక్షల వరకు సంపాదిస్తుండడం విశేషం. ఒక సారి అధిక మొత్తంలో నెలకు రూ.10 లక్షలు కూడా వచ్చాయని అతను చెప్పాడు. ఈ విధంగా రాజేష్ ఓవైపు లారీని నడిపిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నాడు.
మొదట్లో రాజేష్ లారీ డ్రైవ్ చేస్తూ వెళ్లినప్పుడు అతని కుమారుడు అతని వంట వీడియోలను తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. దీంతో అవి పాపులర్ అయ్యాయి. ఇక ఆ తరువాత రాజేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే అలా ఎన్నో వీడియోలను అతను తన చానల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం యూట్యూబ్ లో రాజేష్కు ఏకంగా 1.87 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉండడం విశేషం. అలాగే ఇన్స్టాగ్రామ్లోనూ పెద్ద ఎత్తున ఇతనికి ఫాలోవర్లు ఉన్నారు.
ఆలోచన ఉండాలే కానీ ఏ పని చేసి అయినా సరే డబ్బు సంపాదించవచ్చు.. అని చెప్పేందుకు రాజేష్ జీవితమే ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఇక అతను వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే సొంతంగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని అతను చెప్పాడు. రాజేష్ జీవితం నిజంగా ఇలా ఉపాధి పొందాలనుకుంటున్న వారికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…