Cardamom : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే యాలకులను తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఇవి సుగంధ ద్రవ్యాల జాబితాకు చెందుతాయి. వీటిని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. యాలకులను ఎక్కువగా తీపి వంటకాల తయారీలో వాడుతారు. అయితే వాస్తవానికి యాలకులను మనం రోజూ తినవచ్చు. రోజూ పరగడుపునే రెండు యాలకులను తిని గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక యాలకులను రోజూ తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారికి యాలకులు ఒక వరం అనే చెప్పవచ్చు. యాలకులను తిని నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. ఇక యాలకులను రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్దకం ఉన్నవారు రోజూ యాలకులను తింటే ఫలితం ఉంటుంది. యాలకులలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.
అందువల్ల యాలకులను తింటే శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి యాలకులు ఎంతగానో మేలు చేస్తాయి. యాలకులను రోజూ తినడం వల్ల ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులను తింటే నోట్లోని బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇక యాలకులను రోజూ తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా యాలకులతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ తినాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…