Foods For Skin : చూడచక్కని, మృదువైన, మెరిసే చర్మం ఉండాలనే చాలా మంది కోరుకుంటారు. కానీ కొందరికి ఈ తరహా చర్మం పుట్టుకతోనే వస్తుంది. కానీ కొందరికి మాత్రం ఇలా ఉండదు. ఏదో ఒక చర్మ సమస్య ఉంటుంది. దీంతో వారు తమ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకుంటే చాలు.. దాంతో చర్మ సమస్యలను పోగొట్టుకోవచ్చు. అలాగే చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. మరి అందుకు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
మన శరీరంలో ఉండే లివర్ సరిగ్గా పనిచేసేందుకు మెగ్నిషియం ఎంతగానో ఉపయోగపడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటేనే చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. కనుక లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆహారం కూడా తినాలి. అందుకు గాను మెగ్నిషియం ఎక్కువగా ఉండే డార్క్ చాకొలెట్లు, ఫిగ్ పండ్లు, అరటి పండ్లు, విత్తనాలు, అవకాడో తదితరాలను నిత్యం తీసుకుంటే తద్వారా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో చర్మం కూడా సురక్షితంగా, కాంతివంతంగా మారుతుంది.
ఫ్యాటీ యాసిడ్లు కూడా మన చర్మాన్ని సంరక్షిస్తాయి. కనుక ఇవి ఎక్కువగా ఉండే ఆలివ్ ఆయిల్, అవిసె విత్తనాలు, బాదంపప్పు, తృణ ధాన్యాలు ఎక్కువగా తింటే ఫ్యాటీ యాసిడ్లు లభించి తద్వారా చర్మ సమస్యలు పోతాయి. చర్మ సౌందర్యం పెరుగుతుంది. తాజా కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, నట్స్ శరీరంలో ఆల్కలైన్ స్వభావాన్ని పెంచుతాయి. దీని వల్ల చర్మం సంరక్షింపబడుతుంది. కనుక వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…