Eucalyptus Oil : మనకు కలిగే అనేక అనారోగ్యాలను నయం చేసుకునేందుకు మనకు అనేక రకాల సహజసిద్ధమైన పదార్థాలు ఔషధాలుగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో నీలగిరి తైలం కూడా ఒకటి. దీన్ని నీలగిరి చెట్ల నుంచి తీస్తారు. అయితే ఈ ఆయిల్ మనకు అనేక లాభాలను ఇస్తుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నీలగిరి తైలం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమల సమస్యతో బాధపడే వారు వాటిపై నిత్యం రెండు పూటలా కొద్దిగా నీలగిరి తైలాన్ని రాయాలి. దీంతో అతి తక్కువ సమయంలోనే మొటిమల నుంచి బయట పడవచ్చు. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇతర మచ్చలు కూడా పోతాయి. దుస్తులు ఉతికేటప్పుడు కొద్దిగా నీలగిరి తైలం వేసి వాటిని ఉతకాలి. దీంతో దుస్తులకు పట్టి ఉండే ఫంగస్, ఇతర క్రిములు నశిస్తాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే బెడ్షీట్లు, దిండు కవర్లు తదితర ఇతర వస్త్రాలపై కూడా నీలగిరి తైలం చల్లుతుంటే అవి సువాసన వస్తాయి. అంతేకాకుండా క్రిములు రాకుండా ఉంటాయి. ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని అందులో కొద్దిగా నీలగిరి తైలం వేసి ఆపైన వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా రోజుకు 2, 3 సార్లు చేస్తే ఎంతటి జలుబైనా త్వరగా తగ్గుతుంది. అలాగే దగ్గు, ముక్కు దిబ్బడ, ఫ్లూ జ్వరం తదితర ఇతర శ్వాస కోశ సమస్యలు కూడా నయమవుతాయి.
శరీరంలో నొప్పులు ఉన్న ప్రదేశంలో నీలగిరి తైలం రాసి ఆయా భాగాల్లో వేడి నీటి కాపడం పెట్టాలి. దీంతో నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కీళ్లు, కండరాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. కొబ్బరినూనెకు కొద్దిగా నీలగిరి తైలం కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. తరువాత కొంతసేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు బాధ నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే షాంపూలోనూ కొద్దిగా ఈ ఆయిల్ కలిపి తలస్నానం చేసినా చుండ్రు నుంచి తప్పించుకోవచ్చు. గోరు వెచ్చని నీరు కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నీలగిరి తైలం వేసి బాగా కలిపి దాంతో నోరు పుక్కిలించాలి. రోజూ ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది.
నిత్యం ఆహారంలో నీలగిరి తైలం చేర్చి తీసుకోవడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నీలగిరి తైలంలో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ తైలాన్ని నిత్యం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…