Fruits : ఉదయం ఖాళీ కడుపుతో మనం రోజూ అనేక రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. ఉదయాన్నే కొండరు పరగడుపునే బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. అలా తాగకపోతే వారికి సంతృప్తి ఉండదు. కాఫీ, టీ లతోనే వారు రోజును ప్రారంభిస్తారు. ఇక కొందరు భిన్న రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. అయితే ఉదయం పరగడుపునే పండ్లు తినేవారు మాత్రం కొన్ని రకాల పండ్లను తినకూడదు. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక ఏయే పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదో, వాటి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లను తినకూడదు. సిట్రస్ పండ్లు అంటే నిమ్మ, నారింజ లాంటివన్నమాట. వీటిని తింటే తాజాగా ఫీల్ వస్తుంది. అయితే వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తినరాదు. ఎందుకంటే వీటిల్లో ఉండే ఆమ్లాలు గుండెల్లో మంట, పొట్టలో అసౌకర్యం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను కలగజేస్తాయి. కనుక ఉదయం పరగడుపునే సిట్రస్ పండ్లను తినకూడదు. అలాగే టమాటాలను కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. వీటి జ్యూస్ కూడా తాగకూడదు. టమాటాల్లో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పొట్టలో ఆమ్లత్వాన్ని పెంచుతుంది. దీంతో అసిడిటీ ఎక్కువవుతుంది. కనుక ఉదయం పరగడుపున టమాటాలను తీసుకోరాదు.
అరటి పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటి రుచి కూడా బాగుంటుంది. అయితే అరటి పండ్లలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు అరటి పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తింటే అది క్యాల్షియంతో ప్రభావితం అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక అరటి పండ్లను కూడా ఖాళీ కడుపుతో తినకూడదు.
పైనాపిల్ పండ్లు అన్నా కూడా చాలా మందికి ఇష్టమే. వీటిని జ్యూస్గా చేసుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే పైనాపిల్ పండ్లలో బ్రొమెలియిన్ ఉంటుంది. ఇది పొట్టలో యాసిడ్ల శాతాన్ని పెంచుతుంది. దీంతో పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. కనుక పైనాపిల్ పండ్లను కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. అలాగే జామ పండ్లు, పుచ్చకాయలు, కివి, మామిడి పండ్లను కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిల్లోనూ విటమిన్ సి, పలు రకాల యాసిడ్లు ఉంటాయి. ఇవి జీర్ణాశయానికి మంచివి కావు. కాబట్టి ఈ పండ్లను ఉదయం పరగడుపున తీసుకోరాదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…