Clothes Washing : మన దేశంలో అనేక రకాల ఆచార సంప్రదాయాలున్నాయి. వీటిని కొందరు మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తే మరికొందరు పాటిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతి ఆచార సంప్రదాయం వెనుక ఏదో ఒక నిగూఢ విషయం ఉందనేది వాస్తవం. అలాంటిది బట్టలుతికిన నీటిని కాళ్లపై పోసుకోవడం ఒకటి. అలా చేస్తే పుట్టింటి వారికి అరిష్టం అని పెద్దలు చెపుతుంటారు. నేను కాళ్లపై పోసుకుంటే వారికి ఎలా అరిష్టం అవుతుందని మొండిగా కొందరు ప్రవర్తిస్తే మరికొందరు అలవాటు కొద్దీ ఆ పని చేస్తారు. పెద్దలు చెప్పారని కాకపోయినా దీని గురించిన కొన్ని విషయాలను ఆలోచిద్దాం.
చాలా మంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత జాడించేసి ఆ నీళ్లను పారబోస్తూ తమ కాళ్లపై పోసుకుంటారు. బట్టలు ఉతికిన నీళ్లను కాళ్ల మీద పోసుకుంటే కాళ్లు శుభ్రమవుతాయని భావించడం ఓ కారణం. దీనిని ఆచారం అనడం కన్నా అలవాటు అంటే బాగుంటుందేమో. స్త్రీలు ఎక్కువ కాలం నీళ్లలో ఉండటం వల్ల కాళ్లు పాడవుతాయి. నీళ్లలో నాని నాని పగుళ్లు వస్తాయి. అలాంటి పగుళ్ల ద్వారా బట్టలు ఉతికినప్పుడు వాటిలోని సూక్ష్మ క్రిములు పగుళ్ల ద్వారా వారి కాళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
దాని ద్వారా వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొందరు భర్తలు భార్యలతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటారు. అదే భార్యలు కాస్త అనారోగ్యానికి గురైనా చాలు వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందన్న భయంతో సేవ చేసే ఓపిక లేక పుట్టింటికి పంపేస్తారు. పుట్టింటివారు కాస్త ఓపికమంతులు, స్థితిమంతులు అయితే ఫర్వాలేదు. లేకపోతే ఇబ్బందే కదా. అందుకే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదు అంటారు. పుట్టింటి వారికి ఇబ్బంది అని చెప్పే కోణంలో అరిష్టమని చెప్పి ఉండొచ్చు. ఇదీ అసలు సంగతి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…