Clothes Washing : మన దేశంలో అనేక రకాల ఆచార సంప్రదాయాలున్నాయి. వీటిని కొందరు మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తే మరికొందరు పాటిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతి ఆచార సంప్రదాయం వెనుక ఏదో ఒక నిగూఢ విషయం ఉందనేది వాస్తవం. అలాంటిది బట్టలుతికిన నీటిని కాళ్లపై పోసుకోవడం ఒకటి. అలా చేస్తే పుట్టింటి వారికి అరిష్టం అని పెద్దలు చెపుతుంటారు. నేను కాళ్లపై పోసుకుంటే వారికి ఎలా అరిష్టం అవుతుందని మొండిగా కొందరు ప్రవర్తిస్తే మరికొందరు అలవాటు కొద్దీ ఆ పని చేస్తారు. పెద్దలు చెప్పారని కాకపోయినా దీని గురించిన కొన్ని విషయాలను ఆలోచిద్దాం.
చాలా మంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత జాడించేసి ఆ నీళ్లను పారబోస్తూ తమ కాళ్లపై పోసుకుంటారు. బట్టలు ఉతికిన నీళ్లను కాళ్ల మీద పోసుకుంటే కాళ్లు శుభ్రమవుతాయని భావించడం ఓ కారణం. దీనిని ఆచారం అనడం కన్నా అలవాటు అంటే బాగుంటుందేమో. స్త్రీలు ఎక్కువ కాలం నీళ్లలో ఉండటం వల్ల కాళ్లు పాడవుతాయి. నీళ్లలో నాని నాని పగుళ్లు వస్తాయి. అలాంటి పగుళ్ల ద్వారా బట్టలు ఉతికినప్పుడు వాటిలోని సూక్ష్మ క్రిములు పగుళ్ల ద్వారా వారి కాళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
దాని ద్వారా వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొందరు భర్తలు భార్యలతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటారు. అదే భార్యలు కాస్త అనారోగ్యానికి గురైనా చాలు వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందన్న భయంతో సేవ చేసే ఓపిక లేక పుట్టింటికి పంపేస్తారు. పుట్టింటివారు కాస్త ఓపికమంతులు, స్థితిమంతులు అయితే ఫర్వాలేదు. లేకపోతే ఇబ్బందే కదా. అందుకే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదు అంటారు. పుట్టింటి వారికి ఇబ్బంది అని చెప్పే కోణంలో అరిష్టమని చెప్పి ఉండొచ్చు. ఇదీ అసలు సంగతి.
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…