Chintha Chiguru Pulihora : పులిహోర.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. చింతపండు, మిరియాల పొడి, ఇంగువ వేసి చేసే పులిహోర అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా పలు ఆలయాల్లో పులిహోరను ప్రసాదంగా పెడుతుంటారు. ఇది మరింత టేస్టీగా ఉంటుంది. అయితే చింత చిగురుతోనూ మనం పులిహోరను తయారు చేయవచ్చు. ఇది ఈ సీజన్లో మనకు ఎక్కువగా లభిస్తుంది. కనుక చింత చిగురుతో పులిహోరను తయారు చేసి తింటే జిహ్వ లేచి వస్తుంది. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత చిగురు – ఒక కప్పు, పొడి అన్నం – రెండు కప్పులు, వేరుశనగ పప్పు – మూడు పెద్ద చెంచాలు, శనగపప్పు – రెండు పెద్ద చెంచాలు, ఆవాలు – అర టీస్పూన్, మినప పప్పు – పెద్ద టీస్పూన్, పసుపు – కొద్దిగా, కరివేపాకు – నాలుగు రెబ్బలు, ఎండు మిర్చి – 3, నూనె – తగినంత, ఉప్పు – రుచికి సరిపడా, ఇంగువ – చిటికెడు.
అన్నం ఉడుకుతున్నప్పుడే ఒక టీస్పూన్ నూనె, చిటికెడు ఉప్పు కలిపి పొడిగా వండి చల్లార్చాలి. అర టీస్పూన్ నూనెలో చింత చిగురును పచ్చి వాసన పోయే వరకు చిన్నమంటపై వేయించి పక్కనుంచాలి. ఇదే కడాయిలో నూనె వేసి ఎండు మిర్చి, వేరుశనగ గింజలు, శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒక్కొక్కటిగా వేగనిచ్చి తాళింపుని చిగురుతోపాటు అన్నంలో కలిపితే చాలు. ఎంతో రుచిగా ఉండే చింతచిగురు పులిహోర రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఆలు టమాటా లాంటి కర్రీలతోనూ కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…