Black Marks On Tongue : మన శరీరంలోని అనేక అవయవాల్లో నాలుక కూడా ఒకటి. ఇది మనకు రుచిని తెలియజేస్తుంది. దీంతో మనం అనేక రకాల వంటకాల రుచులను ఆస్వాదిస్తాము. అయితే డాక్టర్ల వద్దకు వెళ్లగానే మన నాలుక చూపించమంటారు. ఎందుకంటే నాలుకను చూసి మనకు వచ్చిన అనారోగ్య సమస్య గురించి ఇట్టే చెప్పవచ్చు. అందువల్లే వైద్యులు ముందుగా నాలుక చూపించమంటారు. అయితే వాస్తవానికి నాలుక ఇచ్చే పలు సూచనలను గుర్తించడం ద్వారా మనం కూడా మనకు కలిగిన అనారోగ్య సమస్య ఏమిటో ముందుగానే తెలుసుకోవచ్చు. ఇక నాలుకపై ఎలాంటి సూచనలు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుక మీద తెల్లగా ఉంటే మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారని, షుగర్ ఉందని అర్థం. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారికి లేదా షుగర్ ఉన్నవారికి కూడా నాలుక మీద తెల్లగా ఉంటుంది. ఇలా గనక ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాలి. లేదంటే సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక నాలుక మీద నల్లని మచ్చలు ఉన్నాయంటే వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే. సాధారణంగా ఇలాంటి మచ్చలు క్యాన్సర్ వల్ల ఏర్పడుతాయి. లేదంటే ధూమపానం చేయడం వల్ల ఏర్పడుతాయి. కనుక ఇలాంటి మచ్చలు వస్తున్నాయంటే అప్రమత్తంగా ఉండాలి. లేదంటే క్యాన్సర్ బారిన పడతారు.
ఇక నోటి సమస్యలు ఉన్నప్పటికీ నాలుక మీద తెల్లని పొర ఏర్పడుతుంది. వీరికి నోటి దుర్వాసన కూడా ఉంటుంది. శరీరంలో బాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉంటే నాలుక పొరలుగా అయినట్లు కనిపిస్తుంది. నాలుక వాపులకు కూడా గురవుతుంది. డీహైడ్రేషన్ బారిన పడిన వారి నాలుక పసుపు రంగులో లేదా పాలిపోయినట్లు కనిపిస్తుంది. ఇలా నాలుకను చూసి మనకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు. ఇవి తెలుసుకుంటే వ్యాధులు మరింత ముదరకుండా చూసుకోవచ్చు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…