Potato : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే బంగాళాదుంపలను తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇది మనకు వంట గదిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. దీంతో అనేక రకాల వంటకాలను తరచూ చేస్తుంటారు. వంటింట్లో కూరగాయలు లేవు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆలుగడ్డనే. దీంతో ఏ కూర చేసినా త్వరగా అవుతుంది. ఆలుగడ్డలు లేకుండా మన కూరలు పూర్తి కావు అంటే అతిశయోక్తి కాదు. దీన్ని నేరుగా అలాగే వండుకోవచ్చు లేదా ఇతర కూరలతో కలిపి కూడా వండుకోవచ్చు. ఆలుగడ్డలు అంటే చాలా మందికి ఇష్టమే. అయితే వీటిని తింటే బరువు పెరుగుతామని చాలా మంది భావిస్తారు. అందువల్ల బరువు తగ్గే ప్రయత్నం చేసే వారు, అధిక బరువు ఉన్నవారు బంగాళాదుంపలను తినేందుకు వెనుకడుగు వేస్తుంటారు.
వాస్తవానికి మనం చెడు జీవనశైలి కారణంగా బరువు పెరుగుతాం. దీంతో చాలా మంది ఊబకాయం బారిన పడుతుంటారు. బరువును తగ్గించుకునేందుకు మనం ఆలుగడ్డలతో చేసిన వాటిని తినడం మానేస్తాం. అయితే బరువు ఉన్నవారు ఆలుగడ్డలను తినకూడదా, వీటిని తింటే బరువు పెరుగుతారా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. దీనికి వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్లు ఉండే మాట వాస్తవమే. అయితే బంగాళా దుంపలను ఉడకబెట్టి తింటే ఏమీ కాదట. దీంతో బరువు పెరగరని వైద్యులు చెబుతున్నారు. ఆలుగడ్డలను చిప్స్ లేదా వేపుడు రూపంలో, జంక్ ఫుడ్ రూపంలో తింటేనే బరువు పెరుగుతారట. అలా చేయడం వల్ల ఆయా ఫుడ్స్లో క్యాలరీలు విపరీతంగా పెరిగిపోతాయి. ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో అన్ని క్యాలరీలు ఉండవు. అందువల్ల ఆలుగడ్డలను తింటే బరువు పెరుగుతామన్నది అపోహే అని అంటున్నారు. అయితే ఆలుగడ్డలను వేపుడు, చిప్స్, జంక్ ఫుడ్ రూపంలో మాత్రం తినొద్దని సూచిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…