Antacids : మద్యం అతిగా సేవించడం, ఒత్తిడి.. జీర్ణ సమస్యలు.. మసాలాలు, కారం ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం.. అల్సర్లు.. తదితర అనేక కారణాల వల్ల మనలో అధిక శాతం మందికి కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. అయితే కడుపులో మంటకు మెడికల్ షాపుల్లో దొరికే అంటాసిడ్లను చాలా మంది వాడుతుంటారు. కొందరు టాబ్లెట్లు వేసుకుంటే, కొందరు అంటాసిడ్ సిరప్లను తాగుతుంటారు. అయితే నిజానికి అంటాసిడ్లను ఎక్కువగా వాడడం మంచిది కాదు. వాటితో మనకు అనేక దుష్పరిణామాలు కలుగుతాయి.
అంటాసిడ్లు సహజంగానే కడుపులో మంటను చాలా తేలిగ్గా, త్వరగా తగ్గిస్తాయి. దీంతో కడుపులో మంట అనిపించగానే చాలా మంది ఆ సిరప్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో కొని తీసుకువచ్చి తాగుతుంటారు. అయితే అంటాసిడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అవి పనిచేయకుండా పోతాయి. దీంతో సమస్య ఇంకా ఎక్కువవుతుంది. కడుపులో మంట పెరుగుతుంది. అప్పుడు అంటాసిడ్లను ఎన్నింటిని తీసుకున్నా ఫలితం ఉండదు.
ఇక అంటాసిడ్లను అధికంగా వాడడం వల్ల చాలా త్వరగా అలసిపోతుంటారు. ఎప్పుడూ నీరసంగా కనిపిస్తారు. ఒంట్లో శక్తి లేనట్లు అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా అలసటగా అనిపిస్తుంది. అలాగే ఒక్కోసారి విరేచనాలు కూడా సంభవిస్తాయి. ఇక కొందరికి తీవ్రమైన మలబద్దకం ఏర్పడుతుంది. మలంలో రక్తం కూడా పడుతుంది. కొందరిలో విరేచనం చాలా కష్టంగా అవుతుంది. కనుక అంటాసిడ్లను ఎక్కువగా వాడేవారు వాటి వాడకాన్ని నియంత్రిస్తే మంచిది. లేదా డాక్టర్ సూచన మేరకు వాటిని వాడుకోవచ్చు.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…