Longer Life : వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఒక దాని వెనుక ఒకటి వచ్చి పడుతుంటాయి. ఈ క్రమంలో ఆయా సమస్యల నుంచి తప్పించుకోవడం కష్టతరమవుతుంటుంది. ఇక చివరకు ఏదో ఒక రోజుకు ఎవరైనా చనిపోక తప్పదు. అయితే ఎక్కువ కాలం బతకాలనుకునేవారు మాత్రం నిత్యం తక్కువ ఆహారం తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ మేరకు కొందరు సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనలు సదరు విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
అమెరికా, చైనాలకు చెందిన కొందరు సైంటిస్టులు ఎలుకలపై ఇటీవలే పలు ప్రయోగాలు చేశారు. కొన్ని ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. వాటిలో కొన్నింటికి సాధారణ ఆహారం ఇచ్చారు. కొన్నింటికి మొదటి గ్రూపు కన్నా 30 శాతం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం ఇచ్చారు. అంటే ఆ ఎలుకలు నిత్యం తినాల్సిన దానికన్నా తక్కువ ఆహారం తిన్నాయన్నమాట. ఈ క్రమంలో కొన్ని రోజుల తరువాత వాటిలోని పలు అవయవాల కణాల పనితీరును పరిశీలించారు. చివరకు వెల్లడైందేమిటంటే.. నిత్యం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకున్న రెండో గ్రూప్నకు చెందిన ఎలుకల్లో ఆయా అవయవాల కణాలు క్షీణించే రేటు తక్కువైందట. అంటే ఆ కణాల వయస్సు చాలా నెమ్మదిగా పెరిగిందట. ఆ కణాలు చాలా ఎక్కువ రోజుల పాటు జీవించి ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో నిత్యం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువ రోజుల పాటు బతకవచ్చని సైంటిస్టులు తేల్చారు.
కాగా సైంటిస్టులు చేపట్టిన సదరు పరిశోధనకు చెందిన వివరాలను సెల్ అనే ఓ జర్నల్లోనూ ప్రచురించారు. ఈ క్రమంలో సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. నిత్యం చాలా తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం పాటు జీవించవచ్చని, అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని, మెటబాలిజం క్రమబద్దీకరింపబడుతుందని అంటున్నారు.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…