Fish Fry : గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. వారంలో కనీసం 2 సార్లయినా చేపలను వండుకుని తినాలని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే చేపల్లో ఉండే ఔషధ గుణాలు అలాంటివి మరి. అందుకే చాలా మంది చేపలను ఎక్కువగా తింటుంటారు. అయితే చేపలను కూరగా వండుకుని తినలేని వారు వాటితో ఫ్రై చేసుకుని తినవచ్చు. మరి చేపల ఫ్రై ఎలా చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
చేపల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – 1 కిలో, ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్లు, కారం – 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, మసాలా పొడి – 2 టీ స్పూన్లు, పసుపు – కొద్దిగా, నూనె – తగినంత.
చేపల ఫ్రై తయారు చేసే విధానం..
ముందుగా చేపల్ని బాగా శుభ్రం చేయాలి. అనంతరం వాటిని మనకు కావల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అనంతరం ఉల్లిపాయని కట్ చేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి బాగా కలియబెట్టాలి. అనంతరం అందులో చేప ముక్కలు వేసి ఆ మిశ్రమం అంతా చేప ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. అనంతరం ఆ ముక్కలను ఒక గంట పాటు అలాగే ఉంచాలి. దీంతో ఆ మిశ్రమం చేపలకు బాగా పడుతుంది. తరువాత పాన్ తీసుకుని అందులో నూనె పోసి కాగాక చేప ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి. సన్నని మంటపై వేయిస్తే చేపలు బాగా ఫ్రై అవుతాయి. ఆ తరువాత ఫ్రై చేసిన చేపముక్కలపై కరివేపాకు, కొత్తిమీర వేసి అలంకరిస్తే చాలు.. ఘుమ ఘుమ లాడే చేపల వేపుడు తయారైపోతుంది.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…