టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రైల్వేలో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే..?

January 15, 2026 9:13 PM

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు జోన్ల‌లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి రైల్వే శాఖ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్ డి పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. మొత్తం 32,438 పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఫిబ్ర‌వ‌రి 23 వ‌ర‌కు చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. పాయింట్స్‌మ‌న్‌, అసిస్టెంట్‌, ట్రాక్ మెయింటెయిన‌ర్‌, అసిస్టెంట్‌, అసిస్టెంట్ లోకో షెడ్‌, అసిస్టెంట్ ఆప‌రేష‌న్స్ త‌దిత‌ర పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియలో భాగంగా భ‌ర్తీ చేస్తారు.

అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు గాను https://indianrailways.gov.in/railwayboard/ అనే అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించి స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు 10వ త‌ర‌గ‌తి, ఐటీఐ అర్హ‌త క‌లిగిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆర్ఆర్బీకి చెందిన అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్ రీజియ‌న్ల‌లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

RRB Group D Recruitment 2025 full details

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు 10వ త‌ర‌గ‌తిలో లేదా ఐటీఐ డిప్లొమా, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ (NCVT) జారీ చేసిన నేషనల్‌ అప్రెంటిషిప్‌ సర్టిఫికెట్‌ (NAC), సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 01.07.2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వ‌య‌స్సు ఉండాలి. ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు ప్రారంభ వేత‌నం రూ.18వేలు చెల్లిస్తారు. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష (సీబీటీ), ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ల వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన వారు రూ.250 చెల్లిస్తే చాలు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now