Fruits : తరచూ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఒక్కో రకమైన పండును తినడం వల్ల అనేక విధాలైన ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన కీలకపోషకాలు కూడా లభిస్తాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని రకాల పండ్లను మాత్రం మనం తొక్క తీయకుండానే తినాలట. అవును, మీరు విన్నది నిజమే. అలా తొక్క తీయకుండా తింటేనే ఆ పండ్ల వల్ల మనకు పూర్తి స్థాయిలో లాభాలు కలుగుతాయట. మరి అలా తొక్క తీయకుండా తినాల్సిన పండ్లేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
యాపిల్ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. అయితే ఇవి యాపిల్ పండ్లలో ఎలా ఉంటాయో వాటి తొక్కలో కూడా అంతే విధంగా ఉంటాయి. కనుక యాపిల్ పండ్లను తొక్క తీయకుండా అలాగే తినాలి. దీని వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. తద్వారా శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లను కూడా మనం తొక్క తీయకుండానే తినాలి. దీని వల్ల ఆ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరానికి అందుతాయి. అంతేకాదు, పియర్స్ పండ్ల తొక్కలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. అందువల్ల అవి మనకు కలిగే వాపులను, నొప్పులను తగ్గించుకునేందుకు ఉపయోగపడతాయి.
చాలా మంది సపోటా పండ్లను తొక్క తీసి తింటారు. అయితే అలా కాకుండా తొక్కతోనే నేరుగా తినాలి. దీని వల్ల జీర్ణాశయం శుభ్రమవుతుంది. దీంతోపాటు పొటాషియం, ఐరన్, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి కీలక పోషకాలు మనకు లభిస్తాయి. కివీ పండును తొక్క తీయకుండా తింటే దాంతో ఆ తొక్కలో ఉండే ఔషధ గుణాలు ఆందోళనను, ఒత్తిడిని దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం తొలగిపోతుంది. జీర్ణ సమస్యలు మాయమవుతాయి.
మామిడి పండ్లను కూడా చాలా మంది తొక్క తీసి తింటారు. కానీ అలా చేయకూడదు. మామిడి పండ్లను తొక్కతో అలాగే తినాలి. దీని వల్ల వాటిలో ఉండే కెరోటినాయిడ్లు, పాలీఫినాల్స్, ఒమెగా-3, ఒమెగా-6 యాసిడ్లు, పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి. అవి క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులను దూరం చేస్తాయి. కనుక ఈ పండ్లను తప్పనిసరిగా తొక్కతోనే తినాల్సి ఉంటుంది. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…