Fruits : తరచూ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఒక్కో రకమైన పండును తినడం వల్ల అనేక విధాలైన ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన కీలకపోషకాలు కూడా లభిస్తాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని రకాల పండ్లను మాత్రం మనం తొక్క తీయకుండానే తినాలట. అవును, మీరు విన్నది నిజమే. అలా తొక్క తీయకుండా తింటేనే ఆ పండ్ల వల్ల మనకు పూర్తి స్థాయిలో లాభాలు కలుగుతాయట. మరి అలా తొక్క తీయకుండా తినాల్సిన పండ్లేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
యాపిల్ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. అయితే ఇవి యాపిల్ పండ్లలో ఎలా ఉంటాయో వాటి తొక్కలో కూడా అంతే విధంగా ఉంటాయి. కనుక యాపిల్ పండ్లను తొక్క తీయకుండా అలాగే తినాలి. దీని వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. తద్వారా శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లను కూడా మనం తొక్క తీయకుండానే తినాలి. దీని వల్ల ఆ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరానికి అందుతాయి. అంతేకాదు, పియర్స్ పండ్ల తొక్కలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. అందువల్ల అవి మనకు కలిగే వాపులను, నొప్పులను తగ్గించుకునేందుకు ఉపయోగపడతాయి.
చాలా మంది సపోటా పండ్లను తొక్క తీసి తింటారు. అయితే అలా కాకుండా తొక్కతోనే నేరుగా తినాలి. దీని వల్ల జీర్ణాశయం శుభ్రమవుతుంది. దీంతోపాటు పొటాషియం, ఐరన్, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి కీలక పోషకాలు మనకు లభిస్తాయి. కివీ పండును తొక్క తీయకుండా తింటే దాంతో ఆ తొక్కలో ఉండే ఔషధ గుణాలు ఆందోళనను, ఒత్తిడిని దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం తొలగిపోతుంది. జీర్ణ సమస్యలు మాయమవుతాయి.
మామిడి పండ్లను కూడా చాలా మంది తొక్క తీసి తింటారు. కానీ అలా చేయకూడదు. మామిడి పండ్లను తొక్కతో అలాగే తినాలి. దీని వల్ల వాటిలో ఉండే కెరోటినాయిడ్లు, పాలీఫినాల్స్, ఒమెగా-3, ఒమెగా-6 యాసిడ్లు, పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి. అవి క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులను దూరం చేస్తాయి. కనుక ఈ పండ్లను తప్పనిసరిగా తొక్కతోనే తినాల్సి ఉంటుంది. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…