Fruits : తరచూ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఒక్కో రకమైన పండును తినడం వల్ల అనేక విధాలైన ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన కీలకపోషకాలు కూడా లభిస్తాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని రకాల పండ్లను మాత్రం మనం తొక్క తీయకుండానే తినాలట. అవును, మీరు విన్నది నిజమే. అలా తొక్క తీయకుండా తింటేనే ఆ పండ్ల వల్ల మనకు పూర్తి స్థాయిలో లాభాలు కలుగుతాయట. మరి అలా తొక్క తీయకుండా తినాల్సిన పండ్లేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
యాపిల్ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. అయితే ఇవి యాపిల్ పండ్లలో ఎలా ఉంటాయో వాటి తొక్కలో కూడా అంతే విధంగా ఉంటాయి. కనుక యాపిల్ పండ్లను తొక్క తీయకుండా అలాగే తినాలి. దీని వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. తద్వారా శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లను కూడా మనం తొక్క తీయకుండానే తినాలి. దీని వల్ల ఆ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరానికి అందుతాయి. అంతేకాదు, పియర్స్ పండ్ల తొక్కలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. అందువల్ల అవి మనకు కలిగే వాపులను, నొప్పులను తగ్గించుకునేందుకు ఉపయోగపడతాయి.
చాలా మంది సపోటా పండ్లను తొక్క తీసి తింటారు. అయితే అలా కాకుండా తొక్కతోనే నేరుగా తినాలి. దీని వల్ల జీర్ణాశయం శుభ్రమవుతుంది. దీంతోపాటు పొటాషియం, ఐరన్, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి కీలక పోషకాలు మనకు లభిస్తాయి. కివీ పండును తొక్క తీయకుండా తింటే దాంతో ఆ తొక్కలో ఉండే ఔషధ గుణాలు ఆందోళనను, ఒత్తిడిని దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం తొలగిపోతుంది. జీర్ణ సమస్యలు మాయమవుతాయి.
మామిడి పండ్లను కూడా చాలా మంది తొక్క తీసి తింటారు. కానీ అలా చేయకూడదు. మామిడి పండ్లను తొక్కతో అలాగే తినాలి. దీని వల్ల వాటిలో ఉండే కెరోటినాయిడ్లు, పాలీఫినాల్స్, ఒమెగా-3, ఒమెగా-6 యాసిడ్లు, పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి. అవి క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులను దూరం చేస్తాయి. కనుక ఈ పండ్లను తప్పనిసరిగా తొక్కతోనే తినాల్సి ఉంటుంది. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…