Gadapa : మనం ఎవరమైనా ఇండ్లను కట్టుకుంటే తలుపులకు కచ్చితంగా గడపలు పెట్టుకుంటాం. ఇంట్లో ఎన్ని దర్వాజాలు బిగిస్తే అన్ని గడపలు కచ్చితంగా ఉంటాయి. అయితే ఇంటికి ఉండే ప్రధాన ద్వారం వద్ద మాత్రం గడప కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. దీనికి తోడు ఆ గడపను పూజిస్తారు. మహిళలు వాటికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. అయితే మీకు తెలుసా..? మహిళలు ఎందుకు అలా చేస్తారో..? గడపకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
గడపలో లక్ష్మీదేవి, తులసి దేవి కొలువై ఉంటారట. వీరు భక్తులకు ధనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తారట. అందుకే మహిళలు గడపలను అలా పూజిస్తారు. అందువల్లే గడపలకు హిందువులు అంత ప్రాధాన్యతను ఇస్తారు. ఈ క్రమంలోనూ ఎవరూ కూడా గడపలపై నిలబడరు. దానికి కాళ్లను తగలనీయరు. అంతేకాదు.. గడపలపై కూర్చోరు కూడా. అలా చేస్తే ఆ ఇంట్లో వారికి ధనం నిలవదట. ఆరోగ్యం సరిగ్గా ఉండదట.
అదేవిధంగా గడపకు అవతల ఒకరు, ఇవతల ఒకరు నిలబడి ఏదీ తీసుకోరు, ఇవ్వరు. అలా చేస్తే ఇద్దరికీ నష్టమే జరుగుతుందట. అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఇదే కాదు, ఇంతకు ముందు చెప్పిన విషయాలను కూడా సరిగ్గా పాటించకపోతే అప్పుడు లక్ష్మీ దేవి, తులసిలను అవమానించినట్టే అవుతుందట. అందుకని గడపకు కచ్చితంగా ప్రాధాన్యతను ఇవ్వాల్సిందేనని పండితులు చెబుతున్నారు. అయితే గడపపై తల కూడా పెట్టి నిద్రించకూడదట. అలా చేస్తే అన్నీ అరిష్టాలే కలుగుతాయట.. అయితే గడప ముందు చక్కని ముగ్గు వేస్తే లక్ష్మీ దేవి ఆ ఇంట నివాసం ఉంటుందట. దీంతో ఆ ఇంట్లో వారికి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయట.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…