Gadapa : మనం ఎవరమైనా ఇండ్లను కట్టుకుంటే తలుపులకు కచ్చితంగా గడపలు పెట్టుకుంటాం. ఇంట్లో ఎన్ని దర్వాజాలు బిగిస్తే అన్ని గడపలు కచ్చితంగా ఉంటాయి. అయితే ఇంటికి ఉండే ప్రధాన ద్వారం వద్ద మాత్రం గడప కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. దీనికి తోడు ఆ గడపను పూజిస్తారు. మహిళలు వాటికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. అయితే మీకు తెలుసా..? మహిళలు ఎందుకు అలా చేస్తారో..? గడపకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
గడపలో లక్ష్మీదేవి, తులసి దేవి కొలువై ఉంటారట. వీరు భక్తులకు ధనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తారట. అందుకే మహిళలు గడపలను అలా పూజిస్తారు. అందువల్లే గడపలకు హిందువులు అంత ప్రాధాన్యతను ఇస్తారు. ఈ క్రమంలోనూ ఎవరూ కూడా గడపలపై నిలబడరు. దానికి కాళ్లను తగలనీయరు. అంతేకాదు.. గడపలపై కూర్చోరు కూడా. అలా చేస్తే ఆ ఇంట్లో వారికి ధనం నిలవదట. ఆరోగ్యం సరిగ్గా ఉండదట.
అదేవిధంగా గడపకు అవతల ఒకరు, ఇవతల ఒకరు నిలబడి ఏదీ తీసుకోరు, ఇవ్వరు. అలా చేస్తే ఇద్దరికీ నష్టమే జరుగుతుందట. అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఇదే కాదు, ఇంతకు ముందు చెప్పిన విషయాలను కూడా సరిగ్గా పాటించకపోతే అప్పుడు లక్ష్మీ దేవి, తులసిలను అవమానించినట్టే అవుతుందట. అందుకని గడపకు కచ్చితంగా ప్రాధాన్యతను ఇవ్వాల్సిందేనని పండితులు చెబుతున్నారు. అయితే గడపపై తల కూడా పెట్టి నిద్రించకూడదట. అలా చేస్తే అన్నీ అరిష్టాలే కలుగుతాయట.. అయితే గడప ముందు చక్కని ముగ్గు వేస్తే లక్ష్మీ దేవి ఆ ఇంట నివాసం ఉంటుందట. దీంతో ఆ ఇంట్లో వారికి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయట.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…