Yellow Teeth : పసుపు రంగులోకి మారిన దంతాలతో మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ దంతాల కారణంగా నలుగురితో సరిగ్గా మట్లాడలేక, చక్కగా నవ్వలేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. దంతాలు పసుపు రంగులోకి మారడానికి అనేక కారణాలు ఉంటాయి. ధూమపానం చేయడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, పంచదార ఎక్కువగా ఉండే శీతల పానీయాలను తాగడం వంటి వివిధ రకాల కారణాల చేత దంతాలు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. పసుపు రంగులోకి మారిన ఈ దంతాలను తెల్లగా మార్చుకోవడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దంతాలను తెల్లగా మార్చుకోవడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే టూత్ పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల పసుపు రంగులో ఉండే దంతాలు తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి.
దంతాలను తెల్లగా మార్చే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా తెల్లగా ఉండే ఒక టూత్ పేస్ట్ ను ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసేసి మెత్తగా చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ ను కూడా గిన్నెలో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. తరువాత ఇందులో చిటికెడు పసుపును వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల దంతాలను తెల్లగా మార్చే పేస్ట్ తయారవుతుంది.
ఇప్పుడు ఈ పేస్ట్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను తరచూ ఉపయోగించే పేస్ట్ వలె ఉపయోగించాలి. అలాగే ఈ టూత్ పేస్ట్ ను ఉపయోగించేటప్పుడు ధూమపానం, మద్యపానం వంటి వాటిని ఆపేయాలి. ఈ టూత్ పేస్ట్ ను బ్రష్ తో తీసుకుని 3 నుండి 4 నిమిషాల పాటు దంతాలను శుభ్రం చేసుకోవాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వెల్లుల్లితో టూత్ పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారడంతో పాటు దంతాల సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దంతాలు పసుపు రంగులో ఉన్న వారు ఈ చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…