ఆధ్యాత్మికం

Anna Prasana : పిల్ల‌ల‌కు అన్న ప్రాస‌న రోజున తొలి ముద్ద ఎవ‌రు తినిపించాలి..?

Anna Prasana : మ‌నం సాధార‌ణంగా చిన్న పిల్ల‌ల‌కు అన్నప్రాస‌న చేస్తూ ఉంటాం. ప్ర‌స్తుత కాలంలో దీనిని కూడా చాలా పెద్ద వేడుక‌గా చేస్తున్నారు. అయితే ఈ అన్న ప్రాస‌న‌ను ఎలా ప‌డితే అలా, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చేయ‌కూడ‌దని పండితులు చెబుతున్నారు. పిల్ల‌ల‌కు అన్న ప్రాస‌న చేయ‌డం వెనుక కూడా ఒక అర్థం ప‌ర‌మార్థం ఉంద‌ని వారు చెబుతున్నారు. చిన్న పిల్ల‌ల‌కు ఐద‌వ నెల నిండి ఆర‌వ నెల వ‌చ్చిన త‌రువాత 5 వ రోజున అన్న ప్రాస‌న చేయాల‌ని శాస్త్రం చెబుతుంది. అలాగే అన్నప్రాస‌న‌ను అమ్మాయి పుట్టింట్లో అన‌గా మేన‌మామ ఇంట్లో చేయాలి. ఆవు పాలు లేదా పెరుగు, తేనె, నెయ్యి, అన్నంతో ప‌ర‌మానాన్ని వండి సిద్దం చేసుకోవాలి.

త‌రువాత క్రిమి కీట‌కాలు లేని, బ‌లాన్ని క‌లిగించే , అలాగే ప‌ది మందికి పెట్టేలా ఉండే అన్నాన్ని ప్ర‌సాదించ‌మ‌ని మంత్రాల‌ను చ‌దువుతూ ఈ ప‌ర‌మానాన్ని ముందుగా దైవానికి నైవేధ్యంగా స‌మ‌ర్పించాలి. త‌రువాత దీనిని పిల్ల‌ల‌కు తినిపించాలి. ఇలా వండిన ప‌ర‌మానాన్ని వెండి ప‌ల్లెంలో తీసుకుని బంగారు ఉంగ‌రం లేదా చెంచాతో పిల్ల‌ల‌కు మూడు సార్లు ముందుగా పెట్టాలి. త‌రువాత చేత్తో తినిపించాలి. ఈ ప‌ర‌మానాన్ని త‌ల్లి ఒడిలో కూర్చున్న శిశువుకు ముందుగా శిశువు తండ్రి తినిపించాలి. త‌రువాత త‌ల్లి త‌రుపు వారైన మేన‌మామ‌, అమ్మ‌మ్మ‌, తాతయ్య వాళ్లు తినిపించాలి. అన్న‌ప్రాస‌న్న చేయ‌డం వ‌ల్ల శిశువుకు గ‌ర్భంలో ఉండ‌గా వ‌చ్చే దోషాలు తొల‌గిపోతాయని పండితులు చెబుతున్నారు. శిశువు గ‌ర్భంలో ఉండ‌గా ఉమ్మ‌తీరు తాగుతుంది. అలాగే విస‌ర్జించిన మ‌ల మూత్రాల‌ను కూడా తాగాల్సి వ‌స్తుంది.

Anna Prasana

ఇలా ర‌క‌ర‌కాల పదార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే దోషాల‌న్నీ కూడా అన్న‌ప్రాస‌న చేయ‌డం వ‌ల్ల తొల‌గిపోతాయని పండితులు చెబుతున్నారు. ఐదు నెల‌ల స‌మ‌యంలో పిల్ల‌ల‌కు నోటి నుండి చొంగ కారుతుంది. అలాగే మాట్లాడ‌నే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు. చొంగ కారుతుందంటే పిల్ల‌ల‌కు త్వ‌ర‌లో దంతాలు వ‌స్తాయ‌ని అర్థం. అన‌గా పిల్ల‌ల‌కు మ‌నం పిండి ప‌దార్థాలు అందించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని శ‌రీరం త‌న ధ‌ర్మాల‌ను తెలియ‌జేస్తుంది. పిండి ప‌దార్థాల‌ను, మాంస‌కృత్తుల‌ను పిల్ల‌ల‌కు బ‌య‌ట నుండి అందించాలి. పిల్ల‌ల్లో చొంగ కార‌డం చూడ‌గానే అన్న‌ప్రాస‌న చేయాల్సిన స‌మ‌యం అన్న‌మైంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. ఈ విధంగా అన్న‌ప్రాస‌న వెనుక కూడా ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయ‌ని దీనిని కూడా శాస్త్రం ప్ర‌కారం చేయాల‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నా భ‌ర్త ఎప్పుడూ నాకు భారం అయ్యేలా ప్ర‌వ‌ర్తించ‌లేదు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్స్!

త‌న వైవాహిక జీవితం ప్ర‌స్తుతం ఎంతో సంతోష‌క‌రంగా ఉంద‌ని, భ‌ర్త మ‌థియాస్ బో త‌నకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని…

Tuesday, 24 February 2026, 10:28 PM

అక్షయ్ కుమార్ చెప్పిన ఆ మాటలే నా జీవితాన్ని మార్చేశాయి: మృణాల్ ఠాకూర్

న‌టుడు అక్ష‌య్ కుమార్ గ‌తంలో త‌న‌కు చెప్పిన మాట‌లు ఎంతో ప్రేర‌ణ‌గా నిలిచాయ‌ని న‌టి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవ‌ల…

Tuesday, 24 February 2026, 9:29 PM

లడ్డూ నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నిప్పులు.. బాధ్యులను వదిలేది లేదు!

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి ఘ‌ట‌న‌లో బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాల్సిందేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్…

Tuesday, 24 February 2026, 6:05 PM

ఓటమి మంచిదే.. టీమిండియాపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026లో భాగంగా అహ్మ‌దాబాద్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోవ‌డం మంచిదేన‌ని, త‌ప్పుల‌ను…

Tuesday, 24 February 2026, 5:30 PM

‘కల్కి 2’ సెట్స్ నుంచి ఫొటో.. అశ్వత్థామ గెటప్‌లో అమితాబ్!

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న క‌ల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…

Tuesday, 24 February 2026, 3:05 PM

జగన్ అడిగితే టికెట్ నేనే కొనిస్తా.. క్రికెట్ మ్యాచ్‌పై లోకేష్ సెటైర్లు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఫైన‌ల్‌కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తాన‌ని, కావాలంటే వైఎస్ జ‌గ‌న్‌కు కూడా…

Monday, 23 February 2026, 10:13 PM

ట్రోలర్లకు సమంత వార్నింగ్.. ఇక సహించేది లేదు! మే 15న మూవీ రిలీజ్..

త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక‌తను వ్యాపింప‌జేసే వారిని ఇక‌పై ఏమాత్రం స‌హించ‌బోన‌ని స‌మంత అన్నారు.…

Monday, 23 February 2026, 7:57 PM

మణిరత్నం-విజయ్ సేతుపతి మూవీలో సాయిపల్లవి.. ధనుష్ ప్లేస్‌లోకి ‘మక్కల్ సెల్వన్’!

త‌మిళ న‌టుడు విజయ్ సేతుప‌తితో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న సినిమాలో న‌టి సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. సాయిప‌ల్ల‌విని ఈ…

Monday, 23 February 2026, 6:21 PM