Pineapple : మనకు మార్కెట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న పండ్లలో పైనాపిల్ ఒకటి. దీని వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఈ పండ్లలో ఉన్నాయి. అన్ని సీజన్లలోనూ పైనాపిల్ మనకు విరివిగా దొరుకుతుంది. అయితే పైనాపిల్ను తింటే ఎవరికైనా నాలుక అంతా పగిలినట్టు అవుతుంది. దీంతోపాటు నాలుకపై దురద కూడా పుడుతుంది. మంట వస్తుంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ పండును తిన్నప్పుడు నాలుకంతా పగులుతుంది. కొంత మందికి మంట, దురదగా కూడా అనిపిస్తుంది. అందుకు కారణం ఏమిటంటే బ్రొమిలెయిన్ అనే రసాయనమే. అయితే దీంతో మనకు ఎలాంటి అపాయం లేదు. అంతా మేలే జరుగుతుంది. పైనాపిల్ పండును తిన్నప్పుడు అందులోంచి బ్రొమిలెయిన్ రసాయం విడుదలై అది కెమికల్ రియాక్షన్ వల్ల మళ్లీ వివిధ రసాయనాలుగా మారుతుంది. దీంతోపాటు నాలుకపై ఉండే ప్రోటీన్ విడిపోతుంది. అందువల్లే మనకు పైనాపిల్ను తిన్నప్పుడు అలా నాలుక దురదగా ఉంటుంది. పగులుతుంది. ఈ క్రమంలో పైనాపిల్ను తినడం వల్ల మన శరీరంలో చేరే బ్రొమిలెయిన్ యాంటీ ఇన్ఫ్లామేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది.
అంటే నొప్పులు, వాపులను తగ్గిస్తుందన్నమాట. అంతేకాదు దీంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. అంటే వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే ముడతలను తగ్గిస్తుందన్నమాట. దీంతో ఎల్లప్పుడూ యంగ్గా ఉండవచ్చు. అదేవిధంగా బ్రొమిలెయిన్ వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఫుడ్ అలర్జీలు పోతాయి. ఆస్తమా, సైనస్, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఇన్ని ప్రయోజనాలు మనకు పైనాపిల్ను తినడం వల్ల కలుగుతాయి.
అయితే పైనాపిల్ను తిన్నప్పుడు మన నాలుక పగలకుండా, మంట పుట్టకుండా, దురదగా ఉండకుండా చేసుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఓవెన్ గ్రిల్పై పైనాపిల్ ముక్కలను వేసి గ్రిల్ చేసుకుని తింటే నోరు పగలదు. పైనాపిల్ ముక్కలు మృదువుగా లోపలికి వెళ్లిపోతాయి. అదే విధంగా పైనాపిల్ ముక్కలపై కొద్దిగా ఉప్పు లేదా కారం చల్లుకుని తిన్నా నాలుక పగలదు. మంట పుట్టదు. ఇంకో టిప్ ఏంటంటే పైనాపిల్ను కోసేటప్పుడు పొట్టు రాకుండా చూసుకోవాలి. అలా పొట్టు రాకుండా పైనాపిల్ ముక్కలను కోసుకుని తిన్నా చాలు మన నోరు పగలదు. కనుక ఇక ముందు మీరు పైనాపిల్ ను తినేటప్పుడు ఈ టిప్స్ పాటించి చూడింది. దీంతో నోరు పగలకుండా చూసుకోవచ్చు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…