Pineapple : మనకు మార్కెట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న పండ్లలో పైనాపిల్ ఒకటి. దీని వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఈ పండ్లలో ఉన్నాయి. అన్ని సీజన్లలోనూ పైనాపిల్ మనకు విరివిగా దొరుకుతుంది. అయితే పైనాపిల్ను తింటే ఎవరికైనా నాలుక అంతా పగిలినట్టు అవుతుంది. దీంతోపాటు నాలుకపై దురద కూడా పుడుతుంది. మంట వస్తుంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ పండును తిన్నప్పుడు నాలుకంతా పగులుతుంది. కొంత మందికి మంట, దురదగా కూడా అనిపిస్తుంది. అందుకు కారణం ఏమిటంటే బ్రొమిలెయిన్ అనే రసాయనమే. అయితే దీంతో మనకు ఎలాంటి అపాయం లేదు. అంతా మేలే జరుగుతుంది. పైనాపిల్ పండును తిన్నప్పుడు అందులోంచి బ్రొమిలెయిన్ రసాయం విడుదలై అది కెమికల్ రియాక్షన్ వల్ల మళ్లీ వివిధ రసాయనాలుగా మారుతుంది. దీంతోపాటు నాలుకపై ఉండే ప్రోటీన్ విడిపోతుంది. అందువల్లే మనకు పైనాపిల్ను తిన్నప్పుడు అలా నాలుక దురదగా ఉంటుంది. పగులుతుంది. ఈ క్రమంలో పైనాపిల్ను తినడం వల్ల మన శరీరంలో చేరే బ్రొమిలెయిన్ యాంటీ ఇన్ఫ్లామేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది.
అంటే నొప్పులు, వాపులను తగ్గిస్తుందన్నమాట. అంతేకాదు దీంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. అంటే వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే ముడతలను తగ్గిస్తుందన్నమాట. దీంతో ఎల్లప్పుడూ యంగ్గా ఉండవచ్చు. అదేవిధంగా బ్రొమిలెయిన్ వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఫుడ్ అలర్జీలు పోతాయి. ఆస్తమా, సైనస్, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఇన్ని ప్రయోజనాలు మనకు పైనాపిల్ను తినడం వల్ల కలుగుతాయి.
అయితే పైనాపిల్ను తిన్నప్పుడు మన నాలుక పగలకుండా, మంట పుట్టకుండా, దురదగా ఉండకుండా చేసుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఓవెన్ గ్రిల్పై పైనాపిల్ ముక్కలను వేసి గ్రిల్ చేసుకుని తింటే నోరు పగలదు. పైనాపిల్ ముక్కలు మృదువుగా లోపలికి వెళ్లిపోతాయి. అదే విధంగా పైనాపిల్ ముక్కలపై కొద్దిగా ఉప్పు లేదా కారం చల్లుకుని తిన్నా నాలుక పగలదు. మంట పుట్టదు. ఇంకో టిప్ ఏంటంటే పైనాపిల్ను కోసేటప్పుడు పొట్టు రాకుండా చూసుకోవాలి. అలా పొట్టు రాకుండా పైనాపిల్ ముక్కలను కోసుకుని తిన్నా చాలు మన నోరు పగలదు. కనుక ఇక ముందు మీరు పైనాపిల్ ను తినేటప్పుడు ఈ టిప్స్ పాటించి చూడింది. దీంతో నోరు పగలకుండా చూసుకోవచ్చు.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…