Mauli Thread : ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు కదా..! అదేనండీ.. పూజలు, వ్రతాలు చేసినప్పుడు, శుభ కార్యాలప్పుడు చేతులకు కడతారు కదా. అదే.. ఇక దేవాలయాల్లో కల్యాణాల వంటివి చేయించినప్పుడు కూడా పూజారులు చేతులకు కడతారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకదాని తరువాత ఒకటి ఉంటాయి. అయితే నిజానికి అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా..? దాన్ని ఎందుకు కడతారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వామనావతారం గురించి తెలుసు కదా. బలి చక్రవర్తి వద్దకు ఆయన వచ్చి వరం కోరుకుంటాడు. మూడడుగుల స్థలం కావాలని అడగ్గానే వామనుడు ఒక అడుగును భూమిపై, మరో అడుగుపై ఆకాశంపై పెడతాడు. ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడిగితే అప్పుడు బలి ఏ మాత్రం సందేహించకుండా తన నెత్తిన పెట్టమంటాడు. దీంతో వామనుడు తన కాలిని బలి నెత్తిన పెట్టగానే అతను పాతాళంలోకి పోతాడు. దీంతో బలి దాన గుణానికి మెచ్చిన వామనుడు బలికి మృత్యుంజయుడిగా ఉండేలా వరం ఇస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్ని కడతాడట. అందుకని అప్పటి నుంచి దాన్ని చేతులకు కడుతూ వస్తున్నారు.
అలా మౌళి దారం కడితే ఎవరికైనా కీడు జరగదట. మృత్యువు అంత త్వరగా సమీపించదట. ఎక్కువ కాలం సుఖంగా బతుకుతారట. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతిలు అండగా ఉంటారట. ఏ కష్టాలను రానివ్వరట. అందుకనే మౌళి దారాలను కడతారు. ఇదీ.. ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం. ఇక అవే రంగులు ఎందుకంటే.. ఆ మూడు రంగులు నవగ్రహాల్లో మూడింటిని ప్రతిబింబిస్తాయి. అవి బృహస్పతి, కుజుడు, సూర్యుడు. వీరు వ్యక్తుల ఐశ్వర్యానికి, సుఖానికి, విద్యకు, ఆరోగ్యానికి కారకులట. అందుకని ఆ గ్రహ పీడ ఉండొద్దనే ఉద్దేశంతో ఆ రంగులతో ఉన్న మౌళి దారాన్ని కడతారు. ఇక దీన్ని మగవారికి కుడి చేతికి కడతారు. ఆడవారికి ఎడమ చేతికి కడతారు. పెళ్లి కాని ఆడవారైతే వారికి కూడా కుడి చేతికే కడతారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…