Mauli Thread : ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు కదా..! అదేనండీ.. పూజలు, వ్రతాలు చేసినప్పుడు, శుభ కార్యాలప్పుడు చేతులకు కడతారు కదా. అదే.. ఇక దేవాలయాల్లో కల్యాణాల వంటివి చేయించినప్పుడు కూడా పూజారులు చేతులకు కడతారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి ఒకదాని తరువాత ఒకటి ఉంటాయి. అయితే నిజానికి అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా..? దాన్ని ఎందుకు కడతారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వామనావతారం గురించి తెలుసు కదా. బలి చక్రవర్తి వద్దకు ఆయన వచ్చి వరం కోరుకుంటాడు. మూడడుగుల స్థలం కావాలని అడగ్గానే వామనుడు ఒక అడుగును భూమిపై, మరో అడుగుపై ఆకాశంపై పెడతాడు. ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడిగితే అప్పుడు బలి ఏ మాత్రం సందేహించకుండా తన నెత్తిన పెట్టమంటాడు. దీంతో వామనుడు తన కాలిని బలి నెత్తిన పెట్టగానే అతను పాతాళంలోకి పోతాడు. దీంతో బలి దాన గుణానికి మెచ్చిన వామనుడు బలికి మృత్యుంజయుడిగా ఉండేలా వరం ఇస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్ని కడతాడట. అందుకని అప్పటి నుంచి దాన్ని చేతులకు కడుతూ వస్తున్నారు.
అలా మౌళి దారం కడితే ఎవరికైనా కీడు జరగదట. మృత్యువు అంత త్వరగా సమీపించదట. ఎక్కువ కాలం సుఖంగా బతుకుతారట. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతిలు అండగా ఉంటారట. ఏ కష్టాలను రానివ్వరట. అందుకనే మౌళి దారాలను కడతారు. ఇదీ.. ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం. ఇక అవే రంగులు ఎందుకంటే.. ఆ మూడు రంగులు నవగ్రహాల్లో మూడింటిని ప్రతిబింబిస్తాయి. అవి బృహస్పతి, కుజుడు, సూర్యుడు. వీరు వ్యక్తుల ఐశ్వర్యానికి, సుఖానికి, విద్యకు, ఆరోగ్యానికి కారకులట. అందుకని ఆ గ్రహ పీడ ఉండొద్దనే ఉద్దేశంతో ఆ రంగులతో ఉన్న మౌళి దారాన్ని కడతారు. ఇక దీన్ని మగవారికి కుడి చేతికి కడతారు. ఆడవారికి ఎడమ చేతికి కడతారు. పెళ్లి కాని ఆడవారైతే వారికి కూడా కుడి చేతికే కడతారు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…