Fish : చేపలను తినడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మనకు చేపల ద్వారా లభిస్తాయి. ఈ క్రమంలోనే తరచూ చేపలను తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే చేపలను తింటే అధిక బరువు తగ్గవచ్చా, లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి చేపలు నిజంగానే బరువు తగ్గేందుకు దోహదపడతాయా..? చేపలను తింటే బరువు తగ్గుతారా..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
చేపలను తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. అయితే వారంలో ఒకటి, రెండు సార్లు చేపలను తినడం కాదు.. నిత్యం చేపలను తినాల్సిందే. రోజూ 140 గ్రాముల మోతాదులో చేపలను తింటే అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తాయి. అందువల్ల బరువు తగ్గుతారు.
ఇక చేపల్లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మన ఆకలిని నియంత్రిస్తాయి. అందువల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అలాగే కండరాల నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియలో కూడా శరీరంలో కొంత కవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అందువల్ల చేపలను తింటే అధిక బరువు కచ్చితంగా తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే రోజూ చేపలను తినడం వీలు కాదు కనుక.. వారంలో కనీసం ఒక్కసారైనా తింటే ఎంతో కొంత ప్రయోజనం పొందవచ్చని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…