Brahmanandam : సినిమాల్లో కమెడియన్స్ కి చోటు ఉంటుంది కానీ బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమాకు వెళ్లడం అనవసరం అనేంతగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న కమెడియన్ బ్రహ్మానందం ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే చాలు నవ్వుకునే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. అంతలా తన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ కమెడియన్ అయ్యాడు. తాజాగా జాతిరత్నాలు మూవీతో మళ్ళీ ఆడియన్స్ కి కనిపించాడు. ఇతడిని బ్రహ్మి, జఫ్ఫా బ్రహ్మి అని కూడా పిలుస్తారు. 1956 ఫిబ్రవరి 1న కన్నెగంటి నాగలింగాచార్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించిన బ్రహ్మానందం ప్రస్తుతం 67 ఏళ్ల వయస్సులో ఉన్నాడు.
ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటి వారిపాలెంలో జన్మించిన బ్రహ్మానందం స్కూల్ విద్య సత్తెనపల్లి సురభయ్య హైస్కూల్ లో, కాలేజీ విద్య భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో పూర్తి చేశాడు. టెన్త్ ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఎంఏ తెలుగు చేసిన బ్రహ్మానందం పెళ్లి పెద్దల ఆశీర్వాదంతో లక్ష్మితో అయింది. వీరికి రాజా గౌతమ్, సిద్ధార్ద్ అనే ఇద్దరు కుమారులున్నారు. తండ్రి నాటకాల్లో వేయడం వలన ఇతడికి కూడా నాటకాలంటే ఇష్టం ఉండేది. ఫ్రెండ్స్ ముందు కామెడీ చేసేవాడు. దూరదర్శన్ లో పకపకా అనే ప్రోగ్రాం లో చేశాడు. జంధ్యాల డైరెక్ట్ చేసిన అహ నా పెళ్ళంట మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఆ సినిమాలో అర గుండు బ్రహ్మానందం క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. 1987లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు 6వేల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి బ్రహ్మానందం క్యారెక్టర్ నచ్చడంతో పసివాడి ప్రాణం మూవీలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు.1994లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు, 2003లో బెస్ట్ మేల్ కమెడియన్ గా, 2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ప్రస్తుతం రూ.1 కోటి నుంచి రూ. 1 కోటి 50 లక్షల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఇష్టమైన హీరోలు. మహానటి సావిత్రి ఇష్టమైన హీరోయిన్. వైజాగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ అండ్ యాక్టింగ్ ఇష్టం. ఇతడికి మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. దాదాపు రూ.350 కోట్ల ఆస్తులు కలిగిన బ్రహ్మానందం హైదరాబాద్ మణికొండలో పంచాయితీ ట్రావెల్స్ లో దాదాపు రూ.7 కోట్ల విలువైన ది ట్రయల్స్ విల్లాలో ఉంటున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…